ముఖ్యమంత్రి కి టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి లేఖ

గౌ. జగన్మోహన్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి..
నమస్కారములు..


విషయం : విదేశాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులను స్వస్థలాలకు రప్పించడం – ఆహారం, నిత్యావసరాలను అందించి అండగా నిలవడం కొరకు..


 ప్రపంచ వ్యాప్తంగా కరోనా సృష్టిస్తున్న ప్రళయాన్ని కళ్లారా చూస్తున్నాం. ఇలాంటి సమయంలో మన రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు, ఉద్యోగార్ధులను రక్షించడంలో, వారికి సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. విద్యార్ధులంటే మన రాష్ట్ర సంపద. మన ఆస్తి. వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. సుమారు 5 లక్షల మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు విదేశాలకు వెళ్లి విద్యనభ్యసిస్తున్నారు. కరోనా ప్రళయం మొదలైన వెంటనే స్వస్థలాలకు చేరుకునేందుకు చాలా మంది విద్యార్ధులు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయినప్పటికీ.. విమానాలు రద్దు కావడం, ఆయా దేశాల్లో కూడా లాక్ డౌన్ విధించడం వలన ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరికొంత మంది విమానాశ్రయాల వరకు చేరుకుని.. అక్కడి నుండి వెనక్కి వెళ్లలేక, స్వస్థలాలకు రాలేక అక్కడే ఉండిపోయారు. దాదాపు 20 రోజులుగా వారందరూ భోజనం కూడా అందక అవస్థలు ఇబ్బందులు పడుతున్నారు. తొలుత విమానాశ్రయ సిబ్బంది, భారత రాయబార కార్యాలయం సదుపాయాలు కల్పించినా.. తర్వాత లాక్ డౌన్ వంటి నిర్ణయాలతో ఆహారం అందించేవారు కూడా కరువయ్యారు.
 తాజాగా విదేశాల నుండి వచ్చినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా మన దేశంలోని వివిధ విమానాశ్రయాల్లో ఆగిపోయిన వారు కూడా వేలల్లో ఉన్నారు. రవాణా సదుపాయాలు లేక, ఇళ్లకు చేరలేక, క్వారంటైన్ నిబంధనల కారణంగా ఇప్పటికీ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. స్వదేశంలో ఉన్నప్పటికీ వారూ ఆహారం లేక అలమటిస్తున్నారు. క్వారంటైన్ కు వెళ్లేందుకు సిద్ధపడ్డప్పటికీ కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారికి ప్రభుత్వం భరోసా కల్పించాలి. విదేశాల్లో ఉన్నత విధ్యను అభ్యసించేందుకు వెళ్లి ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు దాపురించడం బాధాకరం. అలాంటి వారికి ప్రభుత్వం తరఫున భరోసా కల్పించండి. అక్కడి భారత రాయభార కేంద్రాల ద్వారా ఆహార సరఫరా పునరుద్ధరించండి. ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి  తీసుకొచ్చి వారి తల్లిదండ్రుల కన్నీటి కడగండ్లను తుడవండి. అవసరం అనుకుంటే వచ్చిన వారందరినీ క్వారంటైన్ కు ఒప్పించండి. ప్రత్యేక భద్రత నడుమ క్వారంటైన్ కు తరలించండి. దేశం కాని దేశంలో మన విధ్యార్ధులు పడుతున్న కష్టాలను గుర్తించండి.
(బుచ్చి రాంప్రసాద్)
టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కార్యదర్శి)


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..