UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు

UTF గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2 వ విడత గా *40 గిరిజన కుటుంబాలకు నిత్యావసర  వస్తువుల పంపిణీ


*UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు*


ఈరోజు (23-4-2020) ఆంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో2 వ విడతగా నెల్లటూరు సమీపంలోని రాగి చెరువు కట్టను ఆనుకొని ఉన్న జనార్థన కాలనీ మరియు రిలయన్స్ పెట్రోల్ బంకు వెనుకవైపు గల 40 గిరిజన కుటుంబాలకు నెల రోజులకు సరిపడే 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం  గౌరవనీయులు మునిసిపల్  కమిషనర్ వై.ఓబులేసు మరియు జిల్లా UTF జిల్లా అధ్యక్షుడు యన్.నవకోటేశ్వరరావు చేతుల  మీదుగా పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో పనులకు వెళ్ళలేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేద నిస్సహాయ కుటుంబాలను మరలా 2 వ విడతగా  గూడూరు పట్టణ శాఖ UTF ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులు అందించి  ఆదుకోవడం స్పూర్తిదాయకమన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు నివసించే కాలనీలలో 40 మంది గిరిజనులను ఆదుకున్నారన్నారు. దాతలు, యువత ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన CSM ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి N. పరంజ్యోతి మేడం గారిని అభినందించారు. జిల్లా అధ్యక్షులు N.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ  యూటియఫ్ తరుపున నిరు పేదలను గుర్తించి వారికి సహాయం జిల్లా, రాష్ట్ర  వ్యాప్తంగా  జరుగుతుంది అని , UTF ఉపాధ్యాయులు కేవలం విద్య తోనే గాక, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు ద్వారా కూడా సహాయం  అందిస్తున్నామని తెలియజేసారు.ఈ గిరిజన కాలనీలో  కుటుంబాలకు  14 రకాల నిత్యావసర వస్తువులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ZP BOYS ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రావూఫ్ గారు, ఉపాధ్యాయులు  వాసుదేవరావు, సుధీర్,బాలసుబ్రహ్మణ్యం,ప్రాణేష్ రావు , రామ చంద్ర రెడ్డి, A.శ్రీనివాసులు, నాగేశ్వరరావు ,చంద్రమోహన్, భగవాన్ బాబ్జి, I. శ్రీనివాసులు, జగదీష్ , అట్ల రవి, సచివాలయ సిబ్బంది ,వాలెంటీర్లు తదితరులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..