UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు

UTF గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో 2 వ విడత గా *40 గిరిజన కుటుంబాలకు నిత్యావసర  వస్తువుల పంపిణీ


*UTF సేవలు అభినందనీయం : కమిషనర్ వై.ఓబులేసు*


ఈరోజు (23-4-2020) ఆంద్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో2 వ విడతగా నెల్లటూరు సమీపంలోని రాగి చెరువు కట్టను ఆనుకొని ఉన్న జనార్థన కాలనీ మరియు రిలయన్స్ పెట్రోల్ బంకు వెనుకవైపు గల 40 గిరిజన కుటుంబాలకు నెల రోజులకు సరిపడే 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం  గౌరవనీయులు మునిసిపల్  కమిషనర్ వై.ఓబులేసు మరియు జిల్లా UTF జిల్లా అధ్యక్షుడు యన్.నవకోటేశ్వరరావు చేతుల  మీదుగా పంపిణీ చేయడం జరిగింది . ఈ సందర్భంగా మునిసిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ఈ లాక్ డౌన్ సమయంలో పనులకు వెళ్ళలేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేద నిస్సహాయ కుటుంబాలను మరలా 2 వ విడతగా  గూడూరు పట్టణ శాఖ UTF ఉపాధ్యాయులు నిత్యావసర సరుకులు అందించి  ఆదుకోవడం స్పూర్తిదాయకమన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు నివసించే కాలనీలలో 40 మంది గిరిజనులను ఆదుకున్నారన్నారు. దాతలు, యువత ముందుకొచ్చి నిరుపేదలను ఆదుకోవాలని ఆయన కోరారు. అలాగే ఈ సామాజిక సేవా కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన CSM ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి N. పరంజ్యోతి మేడం గారిని అభినందించారు. జిల్లా అధ్యక్షులు N.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ  యూటియఫ్ తరుపున నిరు పేదలను గుర్తించి వారికి సహాయం జిల్లా, రాష్ట్ర  వ్యాప్తంగా  జరుగుతుంది అని , UTF ఉపాధ్యాయులు కేవలం విద్య తోనే గాక, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సామాజిక సేవా కార్యక్రమాలు ద్వారా కూడా సహాయం  అందిస్తున్నామని తెలియజేసారు.ఈ గిరిజన కాలనీలో  కుటుంబాలకు  14 రకాల నిత్యావసర వస్తువులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ZP BOYS ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ రావూఫ్ గారు, ఉపాధ్యాయులు  వాసుదేవరావు, సుధీర్,బాలసుబ్రహ్మణ్యం,ప్రాణేష్ రావు , రామ చంద్ర రెడ్డి, A.శ్రీనివాసులు, నాగేశ్వరరావు ,చంద్రమోహన్, భగవాన్ బాబ్జి, I. శ్రీనివాసులు, జగదీష్ , అట్ల రవి, సచివాలయ సిబ్బంది ,వాలెంటీర్లు తదితరులు పాల్గొని సహాయ సహకారాలు అందించారు.