బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ

బి.సి కాలనీ మిత్ర బృందంచే భోజనాల ప్యాకెట్లు పంపిణీ వింజమూరు: ఏప్రిల్ 16 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని బి.సి. కాలనీ మిత్ర బృందం సభ్యులు గురువారం నాడు స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద వున్న సంచార జాతుల కుటుంబాలకు భోజనాల ప్యాకెట్లును పంపిణీ చేశారు. భోజనాల పంపిణీకి ముఖ్య అతిధిగా తహసిల్ధారు యం.వి.కే.సుధాకర్ రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా తహసిల్ధారు మాట్లాడుతూ తమ కార్యాలయంలో కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న క్రిష్ణ నేతృత్వంలో పలువురు యువకులు బృందంగా ఏర్పడి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తమకు గర్వ కారణంగా ఉందని కొనియాడారు. కరోనా వైరస్ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు మే 3 వ తేదీ వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వింజమూరు మండలంలో స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు విరివిగా కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, భోజనాలు పంపిణీ చేస్తూ పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆకలి దప్పులు తీర్చుతుండటం అభినందించదగిన విషయమన్నారు. తాజాగా యువకులు కూడా మిత్ర బృందాలుగా ఏర్పడి పేద ప్రజలకు సేవలందించడం ప్రశంసనీయమంటూ, అందరూ కూడా ఈ సేవా కార్యక్రమాలను లాక్ డౌన్ ముగిసే వరకు కొనసాగించాలంటూ దాతలందరికీ విజ్ఞప్తి చేస్తూ వారందరికీ తహసిల్ధారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిత్ర మండలి బృందం సభ్యులు ఇ.వెంకటరమణయ్య, పి.క్రిష్ణ, యం.మహేంద్ర, ఆర్.శ్రీహరి, యం.చిన హజరత్, కె.మహేష్, యం.పెద హజరత్, జి.సుబ్బారావు, పి.రాజశేఖర్, వి.ఆర్.ఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..