కరోనా వాహకాలుగా వైసీపీ నేతలు : కె.ఎస్.జవహర్


28.04.2020


కరోనా వాహకాలుగా వైసీపీ నేతలు
మోపిదేవి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్ లో ఉన్నారు
వారంలో కేసులు రెట్టింపవ్వడానికి కారణమెవరు.?


-కె.ఎస్.జవహర్


రాష్ట్రంలో బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదు. యథారాజా తధా ప్రజా అన్న రీతిలో మాట్లాడారే తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో మాట్లాడినట్లు లేదు. మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ఫ్రెస్టేషన్లో ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారు.
 
శ్రీకాళహస్తి మాఢ వీధుల్లో దేవుని విగ్రహాన్ని ఊరేగించినట్లు 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరు.? 50 కరోనా కేసులు నమోదు కావడానికి  కారణం ఎవరు.? గూడూరులో ట్రాక్టర్ ర్యాలీ చేసిందెవరు? కనిగిరి ఎమ్మెల్యే 30 వాహనాల్లో కర్నాటక నుండి ఏపీకి వచ్చి గందరగోళం సృష్టించినది ఎవరు.? లక్షతో బోరు వేయించి భౌతిక దూరం పాటించకుండా లక్ష విలువైన పూలు జల్లించుకున్నది ఎవరు.? విజయసాయి రెడ్డి శ్రీకాకుళం నుండి విజయనగరం, అమరావతి, హైదరాబాద్ మాట్లాడితే మోపిదేవి వెంకటరమణకు కనిపించలేదా.? ఇప్పుడు చెప్పండి కరోనా వాహకాలు ఎవరు.? కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు ఎంత పంచారు.? ఎంత దోచేశారో ప్రజలకు చెప్పరా.?


పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నది ఎవరు.? అసలు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితికి కారణం ఎవరు.? తెలుగుదేశం పార్టీ నేతలు ఆహారం పంచుదామన్నా, సేవ చేద్దామన్నా నిబంధనల పరుతో అడ్డుకుంటున్నారు. వైసీపీ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా తిరుగుతూ కరోనా వ్యాప్తికి కారణమైనది ఎవరు.?


మద్యం షాపుల్లో మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పడానికి సిగ్గులేదా.? తాళం వేశాం.. గొళ్లెం మరచితిమి అన్నట్లు ఎక్సైజ్ అధికారులు వ్యవహరించడంతో అక్కడి మద్యం మొత్తం వైసీపీ నేతలు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. సారాయి ఏరులై పారుతోందని స్పీకరే చెబుతున్నా పట్టించుకోరు. ఇసుక రీచుల్లో జరుగుతున్న దోపిడీ దేశమంతా చూస్తోంది. 
ఏప్రిల్ 12న ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో దేశంలోని అందరు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలంటే.. మన ముఖ్యమంత్రి మాత్రం గ్రీన్ జోన్లు, మండలాల వారీగా సడలింపులు అంటూ 400 కేసుల్ని 1177 కేసులకు పెంచారు. దీని ద్వా ప్రజల ప్రాణాలపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి స్పష్టమైంది. ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైంది. ఇంటెలిజెన్స్ పని చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారు. ముఖ్యమంత్రి ఏకంగా ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్ అంటారు. సహజీవనం చేయాలంటూ అర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఎన్నికలు జరపాలి, తమ వారికి పదవులు కట్టబెట్టాలి. తద్వారా జె ట్యాక్స్ వసూళ్లు పెంచుకోవాలన్నదే ధ్యేయంగా ఉంది తప్ప. ప్రజల ప్రాణాలు ఏమాత్రం పట్టడం లేదు.
ఎన్నికల కమిషనర్ కనగరాజ్ చెన్నై నుండి ఎలా వచ్చారు.? అతనికి క్వారంటైన్ పట్టదా.? రాష్ట్రంలోని పరిస్థితులపై ఫిర్యాదు చేయడానికి అతని అడ్రస్ కూడా తెలియని పరిస్థితి ఎందుకు వచ్చింది.? రాజ్ భవన్ సిబ్బందికి కరోనా సోకడానికి కారణం ఈ ఎన్నికల కమిషనర్ కాదా.? రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు దద్దమ్మలు కాబట్టే పాలన ఇంత దారుణంగా ఉంది. రాష్ట్రంలో నమోదైన కేసులకు గల కారణాలను విశ్లేషించిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. మీ పాలనపై ప్రజలకు క్లారిటీ వచ్చేసింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని ప్రజలు నువ్వే కావాలి అనుకునే పరిస్థితుల్ని 10 నెలల్లోనే తీసుకొచ్చారు.