జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు భారీ స్థాయిలో నిత్యావసర సరుకులను అందజేశాన బి.జె.పి నేత గున్నం ప్రసాద్ రెడ్డి

*పారిశుద్ధ్య కార్మికులకు మాసాంతం జీ.పి.ఆర్ చేయూత* 30 మందికి నిత్యం అల్పాహారం అందజేత.... వింజమూరు, ఏప్రిల్ 27 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరు మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్షులు గున్నం.ప్రసాద్ రెడ్డి ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తన ఉదారతను చాటుకుంటున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా వింజమూరు మేజర్ పంచాయితీలో ప్రతినిత్యం 30 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు నిత్యం వింజమూరులో పారిశుద్ధ్యమును మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నారు. గతంలో పరిస్థితులు ఎలాగున్నా ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో మాత్రం కార్మికులు పారిశుద్ధ్య పనుల విషయంలో నిరంతరం సేవలు అందిస్తున్నారని చెప్పవచ్చు. లాక్ డౌన్ లో భాగంగా టిఫిన్ సెంటర్లు, హోటళ్ళు సైతం మూతపడ్డాయి. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ తెల్లవారు జామునే విధుల్లోకి వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న  బి.జె.పి నేత గున్నం.ప్రసాద్ రెడ్డి తన స్వంత నిధులతో నెల రోజులుగా పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేకంగా తయారు చేయించిన అల్పాహారం ప్యాకెట్లును అందజేస్తూ వారికి ఉదయం పూట ఆకలి దప్పులను తీర్చుతున్నారు. అంతేగాక ఇటీవల కూడా స్థానిక గ్రామ పంచాయితీ కార్యాలయంలో మండల బి.జె.పి నేతల సమన్వయంతో జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు భారీ స్థాయిలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా వైరస్ చైనాలోని ఊహాన్ సిటీలో రూపాంతరం చెంది ఖండాంతరాలు దాటి ప్రపంచ దేశాలకు విస్తరిస్తూ మానవాళి మనుగడకు పెను సవాల్ గా మారడం విచారించదగిన విషయమన్నారు. భారతదేశంలో ఈ వైరస్ నియంత్రణకు మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. జనతా కర్ఫ్యూ సూపర్ సక్సెస్ కావడంతో ప్రజలను కరోనా రక్కసి కబంధ హస్తాల నుండి రక్షించుకునేందుకు ఏకైక మార్గంగా లాక్ డౌన్ ప్రక్రియకు ప్రధానమంత్రి వ్యూహం రచించడం జరిగిందన్నారు. దీనితో కరోనాను మన దేశంలో కొంతమేర కట్టడి చేసినట్లయిందన్నారు. అభివృద్ధి చెందిన పలు దేశాలు ముందుచూపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ చోటుకున్న విషాదకర సంఘటనలను మనం నిత్యం ప్రసార సాధనాల ద్వారా వీక్షిస్తూనే ఉన్నామన్నారు. కానీ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాత్రం కేవలం ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేపడుతున్న ముందు జాగ్రత్త విధానాలతోనే కరోనా వ్యాప్తిని నియంత్రించినట్లవుతున్నదన్నారు. అసలే అంతంత మాత్రంగా ఉంటున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ లాక్ డౌన్ వలన ఆర్ధిక మూలాలు పతనమవుతున్నప్పటికీ లెక్కచేయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన దేశ ప్రజల ప్రాణరక్షణే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తుండటం దేశ ప్రజల అదృష్టమని గున్నం.ప్రసాద్ రెడ్డి అన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image