ఉద్యమం లా పారిశుధ్య పనులు

ఉద్యమం లా పారిశుధ్య పనులుko
వరికుంటపాడు ;
వరికుంటపాడు మండలం లోని పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు ఉద్యమం లా చేపట్టారు. ఎంపీడీఓ సురేష్ బాబు నేతృత్వం లో ఇస్కపల్లి, నల్లబోతులవారిపల్లి కాలనీ, కాంచెరువు, గువ్వడి గ్రామాల్లో హైడ్రోక్లోరిడ్ ద్రావణం పిచికారీ చేపట్టారు. వీధుల వెంబడి మురికి గుంటలు లేకుండా చేసి, పేడ దిబ్బల వద్ద,  మురికి నీరు నిల్వల వద్ద హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి బ్లీచింగ్ చల్లారు. కాంచెరువు గ్రామం లో ప్రజలతో ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామం లొకి ఎవరు కొత్త వ్యక్తులు రాకుండా చూడాలని, ఎవరైన వస్తే సమాచారం అందించాలన్నారు. అలాగే రేషన్ షాప్ ల్లో సామజిక దూరం పాటించాలన్నారు. అనంతరం ఎన్ బి కాలనీ, గువ్వడి లలో రేషన్ పంపిణి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆయన తో బాటు ప్రత్యేక అధికారిని వసంత కుమారి, పంచాయతీ సెక్రటరీ శివకుమార్, వాలంటీర్స్ పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image