పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం

పలు జిల్లాల్లో వరుణుడి బీభత్సం
అమరావతి: రాష్ట వ్యాప్తంగా గురువారం తెల్లవారుజామున పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుముల మెరుపులతో కూడిన వడగండ్ల వానతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. కృష్ణా జిల్లా కురవటంతో కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాలు చిగురుటాకులా వణికాయి. దీంతో మామిడి ,కొబ్బరి చెట్లు విద్యుత్ స్తంభాలు, పూరి గుడిసెలు నేలకొరిగాయి. కృత్తివెన్ను పల్లెపాలెంలో విషాదం చోటు చేసుకుంది. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు జాలర్లు గల్లంతయ్యారు. ఒకరు మృతి చెందారు. నిడమరు పంచాయతీలో మరో ఐదుగురు మత్స్యకారులు గల్లంతవటంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అకాల వర్షం తమ పాలిట శాపంగా మారిందని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని కైకలూరు, కలిదిండి,  మండవల్లి, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్,  గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది.
ప్రకాశం: పర్చూరు ప్రాంతంలో చిరుజల్లులు కురవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా  మిర్చి రైతులు, మిర్చిని పరదాలతో కాపాడుకోటానికి పాట్లు పడ్డారు.
పశ్చిమ గోదావరి: జంగారెడ్డిగూడెం మండలంలో తెల్లవారుజామున ఉరుములతో కూడిన గాలి, వాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా మామిడి కాయలు నెలరాలాయి.  మొక్కజొన్న, వరి పంటలు తడిసిపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
గుంటూరు: జిల్లాలో పలు చోట్ల చెదరుమదరుగా వర్షం కురిసింది. పొన్నూరు, రేపల్లె, బాపట్ల, చిలకలూరిపేటలో మోస్తరు వర్షం పడింది. పొన్నూరు మండలం కొండముదిలో పిడుగుపడి రెండున్నర ఎకరాల వరికుప్ప దగ్ధం అయింది.
తూర్పు గోదావరి: జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అదేవిధంగా రాజనగరం నియోజకవర్గం మూడు మండలాల్లో గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఉపయోగించి రైతులు మొక్కజొన్న, ధాన్యాన్నివర్షం నుంచి కాపాడుకోవడానికి  ప్రయత్నం చేశారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image