ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు

ప్రజలను అడ్డంగా దోచుకుంటున్న వ్యాపారస్తులు


ఎమ్మిగనూరు,ఏప్రిల్,28 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు నియోజకవర్గంలోనీ  ఒక కూరగాయలు తప్పమిగతా నిత్యావసర సరుకులు అన్ని అధిక ధరలకు అమ్ముతున్నారని నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.చికెన్ మరియు మటన్ వ్యాపారస్తులు  సిండికేట్ గా ఏర్పడి ప్రజలనునిత్యందోచుకుంటున్నారని, అదే మాదిరిగా కిరాణం షాపుల్లో కూడా కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు  అమ్ముతున్నారని నవాజ్ తెలిపారు.లాక్‌డౌన్‌ కారణంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి కూడా వ్యాపారస్తులు ఇలా చేయడం ఎంతవరకు సమంజసమనిపట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలను కిరాణా షాపుయజమానులునిత్యావసరసరుకులను,నిత్యావసర సరుకులు అయినా మంచి నూనెను కూడా అధిక ధరలకు అంటగట్టి  అలా చేయడం సబబు కాదని ఇటువంటి సమయంలో ప్రజల దగ్గర నుంచి ఎటువంటి  లాభాలు ఆశించకుండా ప్రజలకు నిత్యవసర సరుకులను ప్రజలకుప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే  అందించాలని  తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు  వ్యాపారస్తులకు,మంచినూనెషాప్యజమానులకు,నిత్యావసర సరుకులు కిరాణా షాప్ యజమానులకు సూచించడం జరిగిందనినవాజ్ తెలిపారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image