ప్రధానితో నిర్మలా సీతారామన్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలు!

 


 


ప్రధానితో నిర్మలా సీతారామన్ అత్యవసర సమావేశం... కీలక నిర్ణయాలు!


20 తరువాతి పరిస్థితులపై చర్చ


ప్యాకేజీ నిధులు సక్రమంగా వినియోగించాలన్న మోదీ


మరిన్ని రంగాలకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం.


కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఓ వైపు రోజురోజుకూ పెరుగుతూ ఉండటం, ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి పాతాళానికి పడిపోయిన నేపథ్యంలో, లాక్ డౌన్ కారణంగా దేశంలో నెలకొన్న ఆర్థిక అత్యయిక పరిస్థితి, దాన్నుంచి బయటపడేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఇండియాలోని హెల్త్ కేర్ సెక్టార్ మినహా మిగతా అన్ని రంగాలూ పూర్తి స్థాయిలో పని చేయడం లేదన్న సంగతి తెలిసిందే. కొన్ని రకాల అత్యవసర విభాగానికి సంబంధించిన ప్లాంట్లు పాక్షికంగా పనిచేస్తున్నాయి. ప్రజా రవాణా, రైళ్లు, విమాన, ఆతిథ్య రంగాలు పూర్తిగా స్తంభించాయి.


ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ, ఈ నెల 20 తరువాత గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని రకాల ఫ్యాక్టరీలను తెరపించుకునేందుకు ఐటీ, ఈ-కామర్స్ రంగాల్లో కార్యకలాపాలు జరిపేందుకు, రైతుల వ్యవసాయానికి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నట్టు కేంద్రం నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోదీతో నిర్మలా సీతారామన్ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్రాల పరిధిలో అన్ని రకాల వస్తువుల ఉత్పత్తిని అనుమతించాలని వీరు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


ఇక హైవేలపై దాబాలు, ట్రక్ రిపేర్ షాపులు, ప్రభుత్వ కార్యకలాపాలపై కాల్ సెంటర్లను 20 తరువాత తిరిగి తెరిపించాలని కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇండస్ట్రియల్ టౌన్ షిప్ కార్యకలాపాలకు కూడా అనుమతించ వచ్చని సమాచారం.


ఇక భారత ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపనగా గత నెలలో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా నిధుల వినియోగంపైనా మోదీ, నిర్మల మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా ప్రకటించిన 1.75 లక్షల కోట్ల రూపాయలను సక్రమంగా వినియోగించాలని ఈ సందర్భంగా మోదీ ఆదేశించారు. ఈ నిధులతో పేదలకు కావాల్సిన ఆహార ధాన్యాలు, నిత్యావసరాలు, వంట గ్యాస్ తదితరాలను మూడు నెలల పాటు సమకూర్చాలని సూచించారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..