గుంటూరు లో నేటి నుండి సరి సంఖ్య దినాల్లో వస్తువుల అమ్మకాలు : ఎస్.పి

.
     గుంటూరు లో నేటి నుండి సరి సంఖ్య దినాల్లో వస్తువుల అమ్మకాలు : ఎస్.పి


కోవిడ్ - 19 కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతి ఎక్కువగా ఉంటుంన్నందున, దానిని అరికట్టే దానిలో భాగంగా నిత్యావసరాలు నిమిత్తం మార్కెట్లు షాపులు ఇంక మీదట సరి సంఖ్య దినాలలో (2,4,6,8,10,12,14,16,18,20,22,24,26,28,30 తేదీలలో) పనిచేస్తాయని, బేస్ సంఖ్య దినాలలో(1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31 తేదీలలో) మార్కెట్లు, షాపులు ఉండవని గుంటూరు అర్బన్ పోలీసు అధికారి డిఐజి పి.హెచ్.డి రామకృష్ణ తెలియజేశారు.


 కనుక ప్రజలందరూ గమనించి రేపు 14 వ తారీఖున సరి సంఖ్య అయినందున మార్కెట్, షాపులు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు తీసి ఉంటాయని, ఎల్లుండి 15 వతేదీ నాడు మూసి ఉంటాయి కనుక కావలసిన అవసరాలు రేపటి రోజునే సమకూర్చు కోవాలసి ఉంటుంది.


 అదేవిధంగా రోజు మార్చి రోజు మార్కెట్లో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి గనుక కావలసిన పాలు,కూరగాయలు తెచ్చుకో వలసినదిగా, అదే విధంగా ద్విచక్ర వాహనం పైన ఒక్కరు, కారు వంటి వాహనం పైన ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని, ఎవరు ఇంటి నుండి ఎవరు బయటకు రాకూడదని, నిత్య అవసరాల నిమిత్తం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి, రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన చోట్ల తీసుకొని త్వరగా ఇంటికి చేరుకోవాలని, మాస్కులు లేకుండా ఎవరు బయట తిరుగరాదని, మిగిలిన సమయాలలో మందుల షాపులు, అత్యవసర ఆసుపత్రులు మినహా మిగిలినవన్నీ మూసి వేయబడతాయని, గవర్నమెంట్ ఉద్యోగులు, ఆఫీసులకు వెళ్లేవారు ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు వెళ్లి, సాయంత్రం 5 నుంచి 6 గంటల లోపుగా ఇండ్లకు చేరుకోవాలని, ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు ఇతరులు ఎవరు తిరుగరాదని, నిబంధనలు ఉల్లంఘించే వారి పైన వాహనాలు స్వాధీనం చేసుకుని, సంబంధిత చట్టాల మేరకు కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోన బడతాయని,  గుంటూరు అర్బన్ పోలీస్ అధికారి  డిఐజి పీ.హెచ్.డి రామకృష్ణ తెలియ జేశారు.