తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది - ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్

పేద,బడుగు,బలహీన  వర్గాలకు ఎప్పుడు ఏ కష్టం  వచ్చిన  తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎమ్మెల్సీ *యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్*


పెనమలూరు నియోజకవర్గం ఉయ్యురు మండలం కాటూరు గ్రామంలో మండల తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకురాలు దండమూడి పూజిత పర్యవేక్షణలో 1600 కుటుంబాలకు ఇంటింటికి పలు రకాల కూరగాయలు పంపిణి కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్సీ *రాజేంద్ర ప్రసాద్* మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గార్లు 


ఈ సందర్భంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని,లాక్ డౌన్ వలన ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటామని, ప్రతిపక్షంలో వున్నా కూడా  ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటు మీ కష్టాలు మా కష్టాలుగా భావిస్తామని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.


మాజీ ఎమ్మెల్యే *బోడే ప్రసాద్* గారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి పేదల జీవితాల్లో చీకటి నింపుతుంది అని, జీవన ఉపాధి లేక చాలా కుటుంబాలు పస్తులు వుంటున్నారని వారందరికీ మేము మన తెలుగుదేశం పార్టీ అండగా ఉంటామని అయన అన్నారు. 


ఈ సందర్బంగా ఇంటింటికి కూరగాయలు పంచుతూ మంచి సేవా కార్యక్రమం చేస్తున్న దండమూడి చౌదరి, పూజిత లను *రాజేంద్ర ప్రసాద్* గారు *బోడే ప్రసాద్* గారు అభినందించారు. 


ఈ కార్యక్రమంలో ఉయ్యురు మండల పార్టీ అధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు, కాటూరు గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకట నారాయణ, బాబూ అజ్మతుల్లా, రాజులపాటి ఫణి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..