ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను కొనసాగిద్దాం..  - మచ్చా రామలింగారెడ్డి

ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను కొనసాగిద్దాం.. 
- మచ్చా రామలింగారెడ్డి


అనంతపురం   ఏప్రిల్ 9 (అంతిమ తీర్పు):                    నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఫాదర్ ఫెర్రర్ 100వ జయంతి వేడుకలు. జిల్లా జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈ రోజు ఉదయం ఆర్డిటి వ్యవస్థాపకుడు ఫాదర్ ఫెర్రర్  100వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మచ్చా రామలింగారెడ్డి  జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) పాల్గొని ఫాదర్ ఫెర్రర్ శిలాఫలకానికి పాలాభిషేకం  చేశారు, ఫాదర్ ఫెర్రర్ జయంతి వేడుకలకు ఆజాద్, మారుతి నందు టైమ్స్ భాస్కర్ రెడ్డి, తేజ ప్రసాద్, జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్  సొసైటీ కార్యదర్శి విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శివప్రసాద్, ఫోటోగ్రాఫర్లు డ్యానీయల్, ఆనంద్ కుమార్ (sku) హరికృష్ణ, జిలాన్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు హనుమంత్ రెడ్డి, నాగేంద్ర దిలీప్, రాజశేఖర్ చిన్న పత్రికల్లో అసోసియేషన్ నాయకులు సాయినాథ్ రెడ్డి, ఉపేంద్ర, కుల్లాయి స్వామి, మీడియా ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ, శివానంద, అది, కృష్ణమూర్తి, నగరంలోని  జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు, ఫాదర్ ఫెర్రర్ జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు.


మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జిల్లాకు ఫాదర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి, జిల్లా ప్రజల హృదయాల్లో ఫాదర్ ఫెర్రర్ బతికే ఉంటాడని అన్నారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కి ఫాథర్ ఫెర్రర్ చేసిన సేవలు ఎనలేనివి అని కొనియాడారు, ఆర్డిటి సంస్థ యాభై ఏళ్లుగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు.


కరోనా తో ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు కోసం ఆర్డిటి సంస్థ అన్నే ఫెర్రర్, మాంచో ఫెర్రర్, విశాల ఫెర్రర్ 800 మంది జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆర్డీటీ సేవలు జర్నలిస్టులు అందరూ గుర్తించి వారికి మరింత సహకారం అందిస్తూ ఫాదర్ ఫెర్రర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మచ్చా రామలింగారెడ్డి విజ్ఞప్తి చేశారు.


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY ANANTAPURAMU💎


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు