స్వీయ నిర్భంధం ద్వారానే కరోనా వైరస్ కట్టడి : ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా  కౌశిక్

స్వీయ నిర్భంధం ద్వారానే కరోనా వైరస్ కట్టడి : ఏ.బి.వి.పి రాష్ట్ర కార్యదర్శి చల్లా  కౌశిక్


. వింజమూరు, ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): కోవిడ్-19 విజృంభణ నేపధ్యంలో ప్రజలు స్వీయ నిర్భంధం పాటించడం ద్వారానే కరోనా వైరస్ కట్టడి సాధ్యమవుతుందని అఖిల భారతీయ విధ్యార్ధి పరిషత్  రాష్ట్ర కార్యదర్శి చల్లా.కౌశిక్ అన్నారు. ఈ మేరకు గురువారం నాడు  సాయంత్రం వింజమూరులో ఆయన ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశం మొత్తం మీద నెల రోజులుగా జరుగుతున్న లాక్ డౌన్ ప్రక్రియకు ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని కౌశిక్ అన్నారు. ఈ కరోనా విస్తృతి నేపధ్యంలో రాష్ట్రంలో కె.జి టు పి.జి వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిందన్నారు. అయితే గత కొన్ని రోజులుగా సెలవులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. రాబోవు విద్యా సంవత్సరానికి విద్యారంగంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు విద్యారంగంలో ఉన్నత స్థాయి సమీక్షలను ప్రభుత్వం నిర్వహించాల్సి ఉందని సూచించారు. విధ్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండా, ప్రమోట్ చేయకుండా ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించి ఆన్ లైన్ ద్వారానే పరీక్షల నిర్వహణను అమలుపరచాలని కోరారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..