డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్ నివాళి

విజయవాడ ఏప్రిల్ 14 (అంతిమ తీర్పు):


భారత రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్ పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత, జెసి-2 కె.మోహన్ కుమార్,డీఆర్వో ఏ. ప్రసాద్,జడ్పీ సీఈఓ సూర్యప్రకాష్,సోషల్ వెల్ఫేర్ డిడి సరస్వతి,డియంహేచ్ఓ రమేష్,వ్యవసాయశాఖ జెడి మోహనరావు తదితరులు పాల్గొన్నారు.