కరోనా పేషేంట్లను ట్రాక్ చేసేందుకు అధునాతన పరికరాన్ని రూపొందిస్తున్నాం : మంత్రి మేకపాటి

 


తేదీ: 30-04-2020,
అమరావతి.


*సీఎం జగన్ చెప్పిందే ముమ్మాటికీ వాస్తవం : మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి*


 వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రపంచమంతా కరోనా ఉంటుంది


*  వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు చెబుతోంది అదే మాటే


* కరోనా నియంత్రణకు మరో వినూత్న ఆలోచన చేశాం


కరోనా పేషేంట్లను ట్రాక్ చేసేందుకు అధునాతన పరికరాన్ని రూపొందిస్తున్నాం


* జీపీఎస్ మాడ్యూల్ ను రూపొందిస్తున్నాం 


* కరోనా  వ్యక్తిని నిరంతరం ట్రాక్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి తీసుకువస్తాం


* కోవిడ్ -19 వైరస్ నియంత్రణకు అవకాశం ఉన్న చోటల్లా టెక్నాలజీని వినియోగించుకుంటాం


* భవిష్యత్ లో ఈ మాడ్యూల్ ఉపయోగం  చాలా ఉంటుంది 


* క్వారంటైన్ జోన్ దాటితే బీప్ శబ్ధంతో అప్రమత్తం చేస్తుంది


* పరిశ్రమలలో రక్షణ చర్యలు చేపట్టి కార్మికులను అనుమతిస్తున్నాం. 


* ముందు జాగ్రత్తలు, రక్షణ చర్యలు చేపడుతూ గ్రీన్ జోన్ లలో ఉన్న  పరిశ్రమలను పరిశీలించి అనుమతి ఇచ్చాం.


* ఎక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రం మనది.


* తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలలోనే మన రాష్ట్రం కన్నా ఎక్కువ కేసులు


* కరోనా విపత్తు సమయంలో ముందుండి పోరాడుతున్న కార్మిక యోధులకు  పేరుపేరునా ముందస్తుగా 'మే డే' శుభాకాంక్షలు


* కార్మికుల కష్టం, శ్రమ విలువ తెలిసిన ప్రభుత్వం మనది


* శ్రీసిటీ సహా అన్ని పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు భరోసానిచ్చేలా శానిటైజర్లు, మాస్కులు, ఉష్ణోగ్రతల పరిశీలన వంటివి పక్కాగా అమలు చేస్తున్నాం


* భౌతికదూరం, పౌష్టికాహారం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం


* ఎవరికి కష్టం వచ్చినా చలించిపోయి స్పందించే ముఖ్యమంత్రి ఉండగా ఎవరికీ ఏ ఇబ్బందీ రాదు


* ప్రజల ఆరోగ్యం, ఆర్థిక నష్ట నివారణ రెండింటిని బ్యాలన్స్ చేసేలా ముఖ్యమంత్రి చర్యలు


*  కరోనా కట్టడికి యావత్ దేశం మెచ్చుకునే  వినూత్న,  వివేకమైన చర్యలు సీఎం జగన్ చేపడుతున్నారు : మంత్రి  గౌతమ్ రెడ్డి


* పనే తప్ప ప్రచారం కోరుకోని వ్యక్తిత్వం ముఖ్యమంత్రిది


* ఎవరు మెచ్చుకున్నా, విమర్శించినా  మా ప్రభుత్వం పనితో మాత్రమే సమాధానం చెబుతుంది


---------------------------------------------