వింజమూరు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ

వింజమూరు సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ


వింజమూరు, ఏప్రిల్ 29 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని పలు ప్రాంతాలలో బుధవారం నాడు ట్రాక్టర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణమును పారిశుద్ధ్య సిబ్బంది పిచికారీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో పారిశుద్ధ్య పనులను రెట్టింపు స్థాయిలో చేయిస్తున్నామన్నారు. ప్రతినిత్యం 30 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులలో ఉంటూ డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయడం, బ్లీచింగ్ చల్లించడం లాంటి పనులు చేపడుతున్నారన్నారు. తాజాగా అంటు వ్యాధుల నిర్మూలనలో భాగంగా హైపోక్లోరైడ్ ద్రావణమును పంచాయితీ పరిధిలోని అన్ని ప్రాంతాలలో స్ప్రే చేయిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను కూడా పాటించాలని శ్రీనివాసులురెడ్డి కోరారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలలో భాగంగా ఎప్పటికప్పుడు చేతులను సబ్బులు, శానిటైజర్లతో శుభ్రంగా ఉంచుకుని విధిగా మాస్కులను ధరించాలని విజ్ఞప్తి చేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image