గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం. 

గుంటూరు పారిశుద్ధ్య కార్మికులకు లక్ష రూపాయల విరాళం


   గుంటూరు, ఏప్రిల్ 16,(అంతిమ తీర్పు) :    బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ గుంటూరు నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం లక్ష రూపాయల విరాళంను చెక్కు రూపంలో ఈ నెల 16వ తేదీన గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ అనురాధ ను కలసి 
మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి నేతృత్వంలో బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి పౌండేషన్ ప్రతినిధి పెండేల ప్రసాదు అందించారు. ఈ సందర్భంగా వల్లo రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గుంటూరు నగరంలో ప్రతి ఆపద సమయంలో డాక్టర్ బొమ్మిడాల శ్రీ కృష్ణమూర్తి ఆదుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయలను, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు రెండు లక్షల రూపాయలను అందించారన్నారు. లాక్ డౌన్ ను  సక్రమంగా అమలు చేయటానికి గుంటూరు నగరంలో కమిషనర్ అనురాధ అవిరళ  కృషి చేస్తుందని అభినందించారు. గుంటూరు నగరంలో అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకుయజమానులందరూ వేతనాలు చెల్లించాలని విన్నవించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరు వారికి తోడ్పాటునoదించాలని విజ్ఞప్తి చేశారు. 


      


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..