ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సారథ్యంతో.....   గర్భిణీ,బాలింత స్త్రీలకు పండ్లు పంపిణీ     

ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సారథ్యంతో.....             గర్భిణీ,బాలింత స్త్రీలకు పండ్లు పంపిణీ     


  కంచికచర్ల   ఏప్రిల్ 13:        ....అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలు,బాలింతలకు ఢీ న్యూస్ వీక్లీ పత్రిక సౌజన్యంతో పండ్లు పంపిణీ చేశారు. సోమవారం నాడు స్థానిక మోడల్ కాలనీ, ప్రణీత కాలనీలోని సెంటర్లో ఉన్న మహిళలకు బలవర్థక పోషకపదార్థాలను అందించాలనే ఉద్దేశంతో పలు రకాలైన పండ్లను వారికి అందజేశారు .ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు బుద్దా నీరజ , వేల్పుల చిన్న మహాలక్ష్మి మాట్లాడుతూ కరోనా ఇబ్బందుల నేపథ్యంలోస దాతల సహాయంతో మహిళలకు పండ్లు ఇవ్వటం అభినందనీయం అన్నారు. గౌతమ్ గిఫ్ట్ ఆర్టికల్స్ అధినేత చిరుమామిళ్ల విజయలక్ష్మి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్  చట్టా  తపస్వి మాట్లాడుతూ మహమ్మారి కరోనాను తరిమికొట్టేందుకు అందరు ఇళ్లలోనే ఉండి లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు .సేవా తత్పరులు ముందుకు వచ్చి ఇబ్బందులు పడుతున్న కుటుంబాల వారికి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు .మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని ఆర్థిక స్థితి కలిగినవారు నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అభిప్రాయపడ్డారు. మానవతాసాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ ఆయాలు యరమాల జ్యోతి , వి. జోజిరాణి తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..