హెలికాప్టర్ మనీ లేదా  క్వాంటిటేటివ్ ఈజింగ్    పద్ధతులను పాటించండి 

హెలికాప్టర్ మనీ లేదా  క్వాంటిటేటివ్ ఈజింగ్    పద్ధతులను పాటించండి 


   హైదరాబాద్ :               తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానితో విడియో కాన్ఫరెన్స్ సందర్భంగా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయినందున, క్వాంటిటేటివ్ ఈజింగ్ - హెలికాప్టర్ మనీ పద్ధతులను అవలంబించి రిజర్వు బ్యాంకు ద్వారా నిధులు అందజేయాలని కోరారు. అసలు ఈ రెండు పద్ధతులు ఏమిటి? వీటిని ఎప్పుడు, ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం.


క్వాంటిటేటివ్ ఈజింగ్.. ఇది ఒక ద్రవ్య విధానం. ఏదైనా దేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తన ఖర్చులు రాబడి కంటే విపరీతంగా పెరిగిపోయి, దాని ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారినప్పుడు, తన వద్ద ఉన్న బాండ్లను, ఇతర ఆర్థిక ఆస్తులను అమ్మి, ఆ లోటును పూడ్చుకోవడమే క్వాంటిటేటివ్ ఈజింగ్.
ఈ పద్ధతిలో ఆ బాండ్లను కొనవలసింది భారత రిజర్వ్ బ్యాంకు. వడ్డీ రేటుతో సంబంధం లేకుండా లభించే ఈ సంపదను రాష్ట్రం తన ఆర్థిక వ్యవస్థలోకి పంపి, ప్రజల కొనుగోలు శక్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా ఆర్థిక సంతులతను స్థిరీకరిస్తుంది. సాధారణంగా ఈ పద్ధతిని ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నప్పుడు వాడటం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతారు.


అదనంగా డబ్బు మార్కెట్లోకి రావడం వల్ల ద్రవ్యలభ్యత ఎక్కువవుతుంది. రుణాల లభ్యత చాలా సులభంగా ఉంటుంది. దాంతో ప్రజలు పెద్ద ఎత్తున రుణాలు తీసుకుని, కొనుగోలు శక్తిని పెంచుకుంటారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదురుకుంటుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ బాండ్లంటే, తన స్వంత ఆర్థిక ఆస్తులన్నమాట. వీటినే 'స్టేట్ డెవలప్‌మెంట్‌ లోన్స్' గా కూడా వ్యవహరిస్తారు. ఒక నిర్ణీత కాల వ్యవధిలో ముందుగా ఒప్పుకున్న శాతాన్ని చెల్లిస్తూ, చివరికి అసలు మొత్తాన్ని చెల్లించడమే ఈ పద్ధతి. ఉదాహరణకు, ఒక రాష్ట్రం ఓ పది కోట్లకు బాండ్‌ను విడుదల చేస్తే, రిజర్వ్ బ్యాంకు దాన్ని 10శాతం వార్షిక చెల్లింపు నిబంధన కింద 10 సంవత్సరాలకు తీసుకుందని అనుకుందాం. అంటే, ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ఆ రాష్ట్రం చెల్లిస్తూ, పదేళ్లు నిండాక అసలు మొత్తం పది కోట్లు చెల్లించాల్సిఉంటుంది. ఇదే క్వాంటిటేటివ్ ఈజింగ్.


ఈ పద్ధతిని ముందుగా జాన్ మేనార్డ్ కేన్స్ అనే ఆర్థికవేత్త ప్రతిపాదించాడని అంటారు. బ్యాంక్ ఆఫ్ జపాన్ ముందుగా అమలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఈ పద్ధతిని అమెరికా, యూరప్‌లలో అవలంబిస్తున్నారు.


హెలీకాప్టర్ మనీ


హెలీకాప్టర్ మనీ అనేది క్వాంటిటేటివ్ ఈజింగ్‌తో పోలస్తే భిన్నమైనదీ, అరుదైనది కూడా. ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయి, ప్రజల కొనుగోలు శక్తి శూన్యమయినప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కేంద్ర బ్యాంకు ప్రజలకు (వినియోగదారులకు) నేరుగా డబ్బు పంపిణీ చేస్తుంది. అంటే, మన బ్యాంకు అకౌంట్‌లో లక్షలకులక్షలు వచ్చి పడటం కాదు కానీ, ఇంచుమించు అలాంటిదే.

ప్రజల ఆదాయం, ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు వారేది కొనడానికి ఆసక్తి చూపరు. అలా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి. దీన్నే ప్రతిద్రవ్యోల్బణం లేదా డిఫ్లేషన్ అంటారు. దీన్ని నివారించాలంటే, ప్రజలకు అయాచితంగా డబ్బు అందాలి. దాంతో వారు మార్కెట్ల మీద పడి, విపరీతంగా కొనుగోలు చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది. హెలీకాప్టర్ ద్వరా డబ్బు వెదజల్లితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. అందుకే ఈ ద్రవ్య విధానానికి ఈ పేరు పెట్టారు.


మరి అలా నేరుగా డబ్బును ప్రజలకే పంపాలంటే ఎలా? ఏదైనా తప్పనిసరి చెల్లింపును రద్దు చేయడం. ఉదాహరణకు మన ఆదాయపు పన్నును కొంత కాలం పాటు రద్దు చేయడం. ఇలా చేయడం వల్ల మన ప్రతీ ఏడాది చెల్లిస్తున్న పన్ను ఇక ఆపేయవచ్చు. దాంతో మనకు చాలా మొత్తం మిగులుతుంది. దాన్ని ఖర్చు చేయడం కోసం కొనుగోళ్లు చేస్తాం. అంతే..


1969లో అమెరికా ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రీడ్‌మన్ ఈ విధానాన్ని ప్రతిపాదించగా, 2002లో మరో ఆర్థికవేత్త బెన్ బెర్నాంకె దానికి మెరుగులు దిద్ది, ప్రాచర్యంలోకి తీసుకొచ్చారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image