విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ఓలా క్యాబ్ లకు అనుమతి..

 


విజయవాడ తేదీ: 9.(అంతిమ తీర్పు) :


పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ఓలా క్యాబ్ లకు అనుమతి..


ఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) 
 ఎమ్. టి. కృష్ణ బాబు 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యవసర వైద్య సదుపాయం  అవసరమయ్యే పౌరులకు రవాణా కోసం  ఓలా క్యాబ్ లకు  విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా అనుమతించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) ఎమ్. టి. కృష్ణ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.


 కోవిడ్ కాకుండా  డయాలసిస్, క్యాన్సర్, గుండె జబ్బులు  తదితర రోగులను  ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి , తిరిగి ఇళ్లకు తీసుకుని వెళ్లాడానికి అనుమతించడం జరిగిందన్నారు. అలాగే విధుల్లో ఉన్న వైద్యులు,  ఆరోగ్య సిబ్బంది  విధులకు హాజరు కావడానికి ఈ సడలింపు ఇవ్వడం జరిగిందన్నారు.  పైలట్ గా విశాఖపట్నం లో అమలుకు అనుమతించడం జరిగిందన్నారు.


కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతున్నాయని, తమకు అవకాశం ఇవ్వాలని ఓలా సంస్థ కోరారన్నారు.   రవాణా, పోలీసు విభాగాలతో సంప్రదించి పై అభ్యర్థనను పరిశీలించి,  ఓలా క్యాబ్ వారి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్  ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.   ఈ సౌకర్యం వైద్య అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించు కోవాలని తెలిపారు. 


  భౌతిక దూరాన్ని పాటిస్తూ,  ప్రమాణాలకు లోబడి డ్రైవర్‌ను మినహాయించి ప్రయాణికుల సంఖ్య ఇద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఈ ప్రయాణ క్రమంలో వినియోగదారులు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలన్నారు.  నియమాలను అతిక్రమించి  ప్రయాణలను తీవ్రంగా పరిగణించబడుతుందని హెచ్చరించారు.  క్యాబ్ క్రమం తప్పకుండా డిస్ ఇన్ఫెక్షన్ స్ప్రేయింగ్  చేయడం మరియు శుభ్రపరచడం చేయాలన్నారు. తద్వారా   OLA ప్రయాణీకుల భద్రతను ఖచ్చితంగా పాటించాలని ఆయన తెలియచేసారు.


--


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు