*23–04–2020*
*అమరావతి*
*విపత్తులో సంక్షేమం*
*నెలరోజుల లాక్డౌన్లో ప్రజలకు అండగా ప్రభుత్వం*
– కోవిడ్–19 ను కట్టడి చేసేందుకు 4 రకాల వ్యూహాలు అమలు
– లాక్డౌన్ అమలు, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ :
– ఏప్రిల్ 23 ఉదయం వరకూ 48,034 పరీక్షలు
– ప్రతి మిలియన్కు 961 పరీక్షలు, దేశంలోనే ప్రథమస్థానం
–రానున్న రోజుల్లో రోజుకు 17,500 వరకూ వెళ్లడానికి అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నాం.
– కేవలం నాలుగు వారాల్లో 9కిపైగా ల్యాబులు
– అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు సార్లు కుటుంబాల వారీ సర్వే
– దగ్గుగాని, జ్వరంకాని.... ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని 32,792 మందిని గుర్తింపు.
– దేశంలో తొలిసారిగా నాణ్యమైన ర్యాపిడ్ టెస్టు కిట్లు
– రాష్ట్ర స్థాయిలో 5 కోవిడ్ ప్రధాన ఆస్పత్రులు
– ఇవికాక జిల్లాల్లో 78 ఆస్పత్రులు
– క్వారంటైన్లలో సుమారు 7900 మంది
–వైయస్సార్ టెలీ మెడిసిన్ కూడా ప్రారంభం.
–దాదాపు 300 మందికి పైగా డాక్టర్ల సేవలు
–14400 అనే నంబర్కు మిస్డ్ కాల్ఇస్తే చాలు. తిరిగి డాక్టర్లే ఫోన్చేసి ఆరోగ్య పరిస్థితి కనుక్కుని ప్రిస్కిప్షన్లు ఇస్తున్నారు. మందుల పంపిణీకూడా రెండు మూడురోజుల్లో ప్రారంభం.
– మాస్క్లు, పీపీఈ కిట్లు అందుబాటులోకి.
– రాష్ట్రవ్యాప్తంగా 1లక్షా 41, 014 ఎన్–95 మాస్క్లు
అందుబాటులోకి
– పీపీఈ కిట్లు 2,71, 072
–సర్జికల్ మాస్కులు 42,70,969
–గ్లౌస్ 32,93,958 ఉన్నాయి.
–మనికిషి 3 చొప్పున 16 కోట్ల మాస్కులు
– డ్వాక్రా మహిళలకు తయారీ అప్పగింత, రోజుకు ఒక్కో మహిళకూ రూ.500కుపైగా ఆదాయం.
*పటిష్టంగా లాక్డౌన్ – మానవతా కోణంలో ప్రజలను ఆదుకునే చర్యలు:*
–ఈ కరోనా వచ్చిన తర్వాత... పేదలకు నెలకు ఒకసారి ఇచ్చే రేషన్ మూడుసార్లు
– బియ్యం ఉచితంగా ఇవ్వడమే కాకుండా కందిపప్పు, శెనగలు కూడా –కూపన్లు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ
– దీనిద్వారా దాదాపు రూ.1125 కోట్లు ఖర్చు చేస్తున్నాం.
– కరోనా సహాయం కింద ప్రకటించిన విధంగా ప్రతి పేదకుటుంబానికీ రూ.1000లు
– దీని ద్వారా ఖజానాపై మరొక రూ. 1470 కోట్లు.
–కార్డు ఉన్నా లేకున్నా.. కష్టంలో ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలు..రేషన్, వేయి రూపాయలు
–గుళ్లు, మసీదులు, చర్చిల్లో పనిచేసేవారి జీవనోపాదికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని పూజారులకు, మౌజంలకు, ఇమామ్లకు, పాస్టర్లకు ఒన్టైం కింద రూ.5వేలు.
– రాష్ట్రానికి రోజుకు కనీసంగా రావాల్సిన ఆదాయం రూ.150 కోట్లు అయితే..., అది జీరో అయిపోయినా సంక్షేమ కార్యక్రమాలు.
– గత ప్రభుత్వం పెట్టిన దాదాపు రూ.1880 కోట్లు.. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపు
– ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి... మార్చి 31 వరకూ ఉన్న బకాయిలను కూడా చెల్లింపునకు రెడీ.
– వచ్చే విద్యా సంవత్సరంనుంచి ప్రతి మూడు నెలలకూ ఫీజురియంబర్స్మెంట్ డబ్బు నేరుగా తల్లి అక్కౌంట్లోకే.
– పాఠశాలల్ని మూసివేసినందున, మధ్యాహ్న భోజనానికి బదులు ఆ పప్పులూ ఉప్పుల్ని డ్రై రేషన్కింద తల్లిదండ్రులకు పంపిణీ.
– ఆరోగ్యశ్రీ కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ తీర్చిన ప్రభుత్వం.
– ఆరోగ్యశ్రీ కింద కోవిడ్
– ఇంతటి కష్టకాలంలో కూడా ఎల్ఐసీ క్లెయిములు మంజూరుచేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వంగా మనం చెల్లించాల్సిన రూ.400 కోట్ల రూపాయలను వెంటనే ఇచ్చేందుకు ఆదేశాలు.
– మొదటి ఏడాదే చెప్పకపోయినా రైతుభరోసా డబ్బు
ఇస్తానన్న రూ.12,500 మరో వేయి పెంచి ఏడాదికి రూ.13,500.
– రెండో ఏడాదైన ఈ సంవత్సరం మే నెలలో చెప్పిన విధంగా రూ.7500.
– త్వరలో గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా.
– అత్యంత పారదర్శకంగా కులం, మతం, రాజకీయాలు చూడకుండా అమలు.
– అలాగే మత్స్యకార భరోసా కింద ప్రతి కుటుంబానికీ వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10వేల రూపాయలను వరుసగా రెండో ఏడాది ఇచ్చేందుకు సన్నాహాలు.
– రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా ఉన్నా, ఆదాయం రాని పరిస్థితి ఉన్నా.. ప్రజలకు ఎక్కడా కష్టం రాకూడదని, ఇన్నిరకాలుగా ఆదుకునే చర్యలు.
– క్వారంటైన్లో ఉండే ప్రతి వ్యక్తికీ రోజుకు భోజనం, బెడ్డుకోసం రూ.500 ఖర్చుచేస్తున్నాం. పారిశుద్ధ్యం కోసం రూ.50, ఇతరత్రా ఖర్చులకు రూ.50, రానుపోను ఛార్జీలకు రూ.600.
– క్వారంటైన్ ముగిసి ఇంటికి వెళ్తున్న సమయంలో రూ.2వేల రూపాయలు.
*నియంత్రణలో ధరలు:*
– ధరలు పెరగకుండా చర్యలు.
– ప్రతిరోజూ పర్యవేక్షణ, ధరలపై ప్రకటన.
– ఎక్కువ రేటుకు అమ్మితే కఠిన చర్యలు.
– అందుబాటులో ఉండేలా రైతుబజార్ల వికేంద్రీకరణ
– ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందుబాటులో రైతు బజార్లు, మొబైల్ మార్కెట్లు.
– రూ. 100లకే పండ్లు వంటి వినూత్న విధానాలకు శ్రీకారం
*ప్రతిక్షణం వ్యవసాయం..., రైతులపైనే ధ్యాస:*
–వరి, మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుములు, వేరుశెనగ లాంటి పంటలు చేతికి అందివస్తున్న సమయంలో కోవిడ్ వల్ల అనుకోని పరిస్థితులు
– ట్రాన్స్పోర్టు లేని పరిస్థితి, రాష్ట్రం వెలుపల అన్ని మార్కెట్లనూ మూసివేసిన పరిస్థితి.
– ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం ధ్యాసపెట్టి, ఎక్కడ అవకాశం ఉన్నాకూడా వదలిపెట్టకుండా రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు
– పక్కరాష్ట్రాలనుంచి 2985 హార్వెస్టర్లు.
– గంటకు రూ.1800 నుంచి రూ.2200 ధర ప్రకటన. .
– ఫాంగేట్ విధానాన్ని తీసుకు వచ్చి రైతు కళ్లం దగ్గరే కొనుగోలుచేసే విధానం.
– వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు.
– గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ను భాగస్వామిగా చేసి దీనికి మరిన్ని మెరుగులు.
– వచ్చే ఖరీఫ్ నాటికి ఎరువుల కొరత రాకుండా 11 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధం
– ఇందులో 3.5 లక్షల టన్నుల యూరియా కూడా ఉంది.
– వరి, వేరుశెనగ తదితర విత్తనాలు 7.7 లక్షల టన్నులు సిద్ధంచేశాం.
ఈ జూన్ నుంచే రైతు భరోసా కేంద్రాలు తెరవబోతున్నాం.
– టమోటా అయినా, అరటి అయినా ఇలా ఏ పంటకు కష్టం వచ్చినా శాయశక్తులా రైతుకు సాయంచేయడానికి ప్రయత్నాలు.
– స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లి రైతుకు కొంతైనా మేలు
*ఆక్వాను ఆదుకునేందుకు చర్యలు:*
– లాక్డౌన్, ప్రపంచవ్యాప్తంగా వైరస్ విస్తరణ పరిస్థితుల వల్ల ఆక్వా ఎగుమతులు నిలిచిపోయినా అన్ని రకాల చర్యలు.
– కోవిడ్ పరిస్థితిని ఎవరూ కూడా సొమ్ము చేసుకోకూడదు, రైతులకు నష్టం రాకూడదు అని ఆలోచన చేసిన ఏకైక ప్రభుత్వం.
– స్వయంగా ప్రభుత్వమే ధరలు ప్రకటించింది.
– ప్రాసెసింగ్ పాంట్లు తెరిపించి.. ఎగుమతులు ప్రారంభించాం.
– స్థానిక మార్కెట్లలోకూడా అమ్మి రైతుల ఇబ్బందులు తీర్చడానికి చర్యలు.
*సడలింపు ప్రాంతాల్లో జాగ్రత్తలతో కార్యకలాపాలు:*
– లాక్డౌన్కు నెల.
– కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు.
– గ్రీన్ క్లస్టర్లలో ఉన్న పరిశ్రమలు పనిచేయడానికి షరతులతో కూడిన అనుమతులు
– అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా 25 రకాల పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు.
–ఆయిల్మిల్లులు, దాల్మిల్లులు, ఫ్లోర్మిల్లులు, పాడి ఉత్పత్తులు , వాటర్ బాట్లింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు ( చక్కెర ఫాక్టరీలకు కూడా), బల్స్ డ్రగ్స్ తయారీ యూనిట్లు, ఆక్సిజన్ తయారీ యూనిట్లు, సప్లై యూనిట్లు
మెడికల్ పరికరాలు, ఉత్పత్తులు, సబ్బులు, డిటర్జెంట్లు, మాస్కులు, బాడీ సూట్లు, శానిటరీ నేప్కిన్స్, కోల్డ్ స్టోరేజీలు, గోడౌన్లు, లాజిస్టిక్స్, పసుపు, ఉప్పు, మిర్చి వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, బేకరీలు, ఆక్వా ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్, పశుదాణాల తయారీ కర్మాగారాలు... అన్ని రకాల పవర్ జనరేషన్ యూనిట్లు, ఆయుర్వేద మందులు, కాలుష్య ట్రీట్మెంట్ ప్లాంట్లు, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు, వాల్మార్ట్, అమెజాన్ వంటి ఇ–కామర్స్ కంపెనీలు నిత్యావసరాల కోసం, రవాణాకు అవసరమైన అన్నిరకాల షాపులు, కోవిడ్ నిరోధానికి ఉపయోగపడే పరికరాలు.. వెంటిలేటర్లు, మాస్కులు.. ఇతరత్రా ఉత్పత్తులు అందిస్తున్న కంపెనీలు... ఇలాంటి కంపెనీలు నడుపుకోమన్నాం.
–కోవిడ్–19 వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుకోవచ్చంటూ అనేక మార్గదర్శకాలు. భౌతిక దూరం పాటిస్తూ ఇవన్నీ కూడా నడుపుకోవచ్చని ఈ నెల 18న జీవో 88 జారీ.