– దేశంలో తొలిసారిగా నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లు :ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

*23–04–2020*
*అమరావతి*


*విపత్తులో సంక్షేమం*


*నెలరోజుల లాక్‌డౌన్‌లో ప్రజలకు అండగా ప్రభుత్వం*


– కోవిడ్‌–19 ను కట్టడి చేసేందుకు 4 రకాల వ్యూహాలు అమలు


– లాక్‌డౌన్‌ అమలు, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ :


– ఏప్రిల్‌ 23 ఉదయం వరకూ 48,034 పరీక్షలు


– ప్రతి మిలియన్‌కు 961 పరీక్షలు, దేశంలోనే ప్రథమస్థానం


–రానున్న రోజుల్లో రోజుకు 17,500 వరకూ వెళ్లడానికి అన్నిరకాల చర్యలూ తీసుకుంటున్నాం.


– కేవలం నాలుగు వారాల్లో 9కిపైగా ల్యాబులు


– అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మూడు సార్లు కుటుంబాల వారీ సర్వే


– దగ్గుగాని, జ్వరంకాని.... ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని 32,792 మందిని గుర్తింపు. 


– దేశంలో తొలిసారిగా నాణ్యమైన ర్యాపిడ్‌ టెస్టు కిట్లు


– రాష్ట్ర స్థాయిలో 5 కోవిడ్‌ ప్రధాన ఆస్పత్రులు


– ఇవికాక జిల్లాల్లో 78 ఆస్పత్రులు


– క్వారంటైన్లలో సుమారు 7900 మంది


–వైయస్సార్‌ టెలీ మెడిసిన్‌ కూడా ప్రారంభం.


–దాదాపు 300 మందికి పైగా డాక్టర్ల సేవలు


–14400 అనే నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ఇస్తే చాలు. తిరిగి డాక్టర్లే ఫోన్‌చేసి ఆరోగ్య పరిస్థితి కనుక్కుని ప్రిస్కిప్షన్లు ఇస్తున్నారు. మందుల పంపిణీకూడా రెండు మూడురోజుల్లో ప్రారంభం.


– మాస్క్‌లు, పీపీఈ కిట్లు అందుబాటులోకి.


– రాష్ట్రవ్యాప్తంగా 1లక్షా 41, 014  ఎన్‌–95 మాస్క్‌లు
 అందుబాటులోకి 


– పీపీఈ  కిట్లు 2,71, 072 


–సర్జికల్‌ మాస్కులు 42,70,969 


–గ్లౌస్‌ 32,93,958 ఉన్నాయి. 


–మనికిషి 3 చొప్పున 16 కోట్ల మాస్కులు 


– డ్వాక్రా మహిళలకు తయారీ అప్పగింత, రోజుకు ఒక్కో మహిళకూ రూ.500కుపైగా ఆదాయం.


*పటిష్టంగా లాక్‌డౌన్‌ – మానవతా కోణంలో ప్రజలను ఆదుకునే చర్యలు:*


–ఈ కరోనా వచ్చిన తర్వాత... పేదలకు నెలకు ఒకసారి ఇచ్చే రేషన్‌ మూడుసార్లు 


– బియ్యం ఉచితంగా ఇవ్వడమే కాకుండా కందిపప్పు, శెనగలు కూడా –కూపన్లు పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ


– దీనిద్వారా దాదాపు రూ.1125 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 


– కరోనా సహాయం కింద ప్రకటించిన విధంగా ప్రతి పేదకుటుంబానికీ రూ.1000లు 


– దీని ద్వారా ఖజానాపై మరొక రూ. 1470 కోట్లు. 


–కార్డు ఉన్నా లేకున్నా.. కష్టంలో ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలు..రేషన్, వేయి రూపాయలు


–గుళ్లు, మసీదులు, చర్చిల్లో పనిచేసేవారి జీవనోపాదికి ఎలాంటి ఇబ్బంది రాకూడదని పూజారులకు, మౌజంలకు, ఇమామ్‌లకు, పాస్టర్లకు ఒన్‌టైం కింద రూ.5వేలు.


– రాష్ట్రానికి రోజుకు కనీసంగా రావాల్సిన ఆదాయం రూ.150 కోట్లు అయితే..., అది జీరో అయిపోయినా సంక్షేమ కార్యక్రమాలు. 


– గత ప్రభుత్వం పెట్టిన దాదాపు రూ.1880 కోట్లు.. ఫీజు రియంబర్స్‌మెంట్‌ బకాయిల చెల్లింపు


– ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి... మార్చి 31 వరకూ ఉన్న బకాయిలను కూడా చెల్లింపునకు రెడీ. 


– వచ్చే విద్యా సంవత్సరంనుంచి ప్రతి మూడు నెలలకూ ఫీజురియంబర్స్‌మెంట్‌ డబ్బు నేరుగా తల్లి అక్కౌంట్లోకే.


– పాఠశాలల్ని మూసివేసినందున, మధ్యాహ్న భోజనానికి బదులు ఆ పప్పులూ ఉప్పుల్ని డ్రై రేషన్‌కింద తల్లిదండ్రులకు పంపిణీ.


– ఆరోగ్యశ్రీ కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలన్నింటినీ తీర్చిన ప్రభుత్వం.


– ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌


– ఇంతటి కష్టకాలంలో కూడా ఎల్‌ఐసీ క్లెయిములు మంజూరుచేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వంగా మనం చెల్లించాల్సిన రూ.400 కోట్ల రూపాయలను వెంటనే ఇచ్చేందుకు ఆదేశాలు. 


– మొదటి ఏడాదే చెప్పకపోయినా రైతుభరోసా డబ్బు
ఇస్తానన్న రూ.12,500 మరో వేయి పెంచి ఏడాదికి రూ.13,500.


– రెండో ఏడాదైన ఈ సంవత్సరం మే నెలలో చెప్పిన విధంగా రూ.7500.


– త్వరలో గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా. 


– అత్యంత పారదర్శకంగా కులం, మతం, రాజకీయాలు చూడకుండా అమలు. 


– అలాగే మత్స్యకార భరోసా కింద ప్రతి కుటుంబానికీ వేట నిషేధ సమయంలో ఇచ్చే రూ.10వేల రూపాయలను వరుసగా రెండో ఏడాది ఇచ్చేందుకు సన్నాహాలు. 


– రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా ఉన్నా, ఆదాయం రాని పరిస్థితి ఉన్నా..  ప్రజలకు ఎక్కడా కష్టం రాకూడదని, ఇన్నిరకాలుగా ఆదుకునే చర్యలు.


– క్వారంటైన్లో ఉండే ప్రతి వ్యక్తికీ రోజుకు భోజనం, బెడ్డుకోసం రూ.500 ఖర్చుచేస్తున్నాం. పారిశుద్ధ్యం కోసం రూ.50, ఇతరత్రా ఖర్చులకు రూ.50, రానుపోను ఛార్జీలకు రూ.600.


– క్వారంటైన్‌ ముగిసి ఇంటికి వెళ్తున్న సమయంలో రూ.2వేల రూపాయలు. 


*నియంత్రణలో ధరలు:*


– ధరలు పెరగకుండా చర్యలు.


– ప్రతిరోజూ పర్యవేక్షణ, ధరలపై ప్రకటన.


– ఎక్కువ రేటుకు అమ్మితే కఠిన చర్యలు. 


– అందుబాటులో ఉండేలా రైతుబజార్ల వికేంద్రీకరణ


– ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అందుబాటులో రైతు బజార్లు, మొబైల్‌ మార్కెట్లు.


– రూ. 100లకే పండ్లు వంటి వినూత్న విధానాలకు శ్రీకారం


*ప్రతిక్షణం వ్యవసాయం..., రైతులపైనే ధ్యాస:*


–వరి, మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుములు, వేరుశెనగ లాంటి పంటలు చేతికి అందివస్తున్న సమయంలో కోవిడ్‌ వల్ల అనుకోని పరిస్థితులు


– ట్రాన్స్‌పోర్టు లేని పరిస్థితి, రాష్ట్రం వెలుపల అన్ని మార్కెట్లనూ మూసివేసిన పరిస్థితి.


– ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం ధ్యాసపెట్టి, ఎక్కడ అవకాశం ఉన్నాకూడా వదలిపెట్టకుండా రైతులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు


– పక్కరాష్ట్రాలనుంచి 2985 హార్వెస్టర్లు.


– గంటకు రూ.1800 నుంచి రూ.2200 ధర ప్రకటన. .


– ఫాంగేట్‌ విధానాన్ని తీసుకు వచ్చి రైతు కళ్లం దగ్గరే కొనుగోలుచేసే విధానం. 


– వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు.


– గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ను భాగస్వామిగా చేసి దీనికి మరిన్ని మెరుగులు.


– వచ్చే ఖరీఫ్‌ నాటికి ఎరువుల కొరత రాకుండా 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు సిద్ధం


– ఇందులో 3.5 లక్షల టన్నుల యూరియా కూడా ఉంది.


– వరి, వేరుశెనగ తదితర విత్తనాలు 7.7 లక్షల టన్నులు సిద్ధంచేశాం.


ఈ జూన్‌ నుంచే రైతు భరోసా కేంద్రాలు తెరవబోతున్నాం.


– టమోటా అయినా,  అరటి అయినా ఇలా ఏ పంటకు కష్టం వచ్చినా శాయశక్తులా రైతుకు సాయంచేయడానికి ప్రయత్నాలు. 


– స్థానిక మార్కెట్లలో విక్రయించడానికి ఒక వ్యూహం ప్రకారం ముందుకెళ్లి రైతుకు కొంతైనా మేలు


*ఆక్వాను ఆదుకునేందుకు చర్యలు:*


– లాక్‌డౌన్, ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విస్తరణ పరిస్థితుల వల్ల ఆక్వా ఎగుమతులు నిలిచిపోయినా అన్ని రకాల చర్యలు.


– కోవిడ్‌ పరిస్థితిని ఎవరూ కూడా సొమ్ము చేసుకోకూడదు, రైతులకు నష్టం రాకూడదు అని ఆలోచన చేసిన ఏకైక ప్రభుత్వం.


– స్వయంగా ప్రభుత్వమే ధరలు ప్రకటించింది. 


– ప్రాసెసింగ్‌ పాంట్లు తెరిపించి.. ఎగుమతులు ప్రారంభించాం. 


– స్థానిక మార్కెట్లలోకూడా అమ్మి రైతుల ఇబ్బందులు తీర్చడానికి చర్యలు. 


*సడలింపు ప్రాంతాల్లో జాగ్రత్తలతో కార్యకలాపాలు:*


– లాక్‌డౌన్‌కు నెల. 


– కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు.


– గ్రీన్‌ క్లస్టర్లలో ఉన్న పరిశ్రమలు పనిచేయడానికి షరతులతో కూడిన అనుమతులు


– అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా 25 రకాల పారిశ్రామిక యూనిట్లకు అనుమతులు.


–ఆయిల్‌మిల్లులు, దాల్‌మిల్లులు, ఫ్లోర్‌మిల్లులు, పాడి ఉత్పత్తులు , వాటర్‌ బాట్లింగ్‌ యూనిట్లు, ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు ( చక్కెర ఫాక్టరీలకు కూడా), బల్స్‌ డ్రగ్స్‌ తయారీ యూనిట్లు, ఆక్సిజన్‌ తయారీ యూనిట్లు, సప్లై యూనిట్లు
మెడికల్‌ పరికరాలు, ఉత్పత్తులు, సబ్బులు, డిటర్జెంట్లు, మాస్కులు, బాడీ సూట్లు, శానిటరీ నేప్‌కిన్స్, కోల్డ్‌ స్టోరేజీలు, గోడౌన్లు, లాజిస్టిక్స్, పసుపు, ఉప్పు, మిర్చి వంటి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, బేకరీలు, ఆక్వా ఫీడ్, పౌల్ట్రీ ఫీడ్, పశుదాణాల తయారీ కర్మాగారాలు... అన్ని రకాల పవర్‌ జనరేషన్‌ యూనిట్లు, ఆయుర్వేద మందులు, కాలుష్య ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, విత్తనాల ప్రాసెసింగ్‌ యూనిట్లు, వాల్‌మార్ట్, అమెజాన్‌ వంటి ఇ–కామర్స్‌ కంపెనీలు నిత్యావసరాల కోసం, రవాణాకు అవసరమైన అన్నిరకాల షాపులు, కోవిడ్‌ నిరోధానికి ఉపయోగపడే పరికరాలు.. వెంటిలేటర్లు, మాస్కులు.. ఇతరత్రా ఉత్పత్తులు అందిస్తున్న కంపెనీలు... ఇలాంటి కంపెనీలు నడుపుకోమన్నాం.


–కోవిడ్‌–19 వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటూ నడుపుకోవచ్చంటూ అనేక మార్గదర్శకాలు. భౌతిక దూరం పాటిస్తూ ఇవన్నీ కూడా నడుపుకోవచ్చని ఈ నెల 18న జీవో 88 జారీ.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image