మానవతా మూర్తి అంగన్వాడీ ఆయా చెన్నమ్మ* 


నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం నాడు దివ్యభారతి కి కాన్పు చేయించిన  మానవతా మూర్తి అంగన్వాడీ ఆయా చెన్నమ్మ* -


*లాక్ డౌన్ లో పరిమళించిన మానవత్వం..అంగన్వాడీ ఆయానే.. అమ్మగా మారి..ఒక నిండు గర్భిణీని ఆస్పత్రికి తీసుకెళ్లి కాన్పు చేయించినందుకు కలెక్టర్ వీరపాండియన్.. చలించి పోయి రూ. 20,000 ల క్యాష్ అవార్డు ప్రకటన* 


కర్నూలు, ఏప్రిల్ 11: కంటికి కనిపించని.. కర్కశ  కరోనా ..ఒక వైపు మనుషుల ఆరోగ్యాన్ని మసి చేస్తూనే.. మరో వైపు మనుషుల్లో మానవత్వాన్ని...తోటివారికి సాయం చేసే గుణాన్ని పెంచింది..ఇందుకు ఉదాహరణ.. జిల్లాలో ఒక అంగన్వాడీ ఆయానే.. అమ్మగా మారి.. లాక్ డౌన్ లో భయపడుతున్న ఒక నిండు గర్భిణీకి..అమ్మ రాలేక పోయినా ..అమ్మలా  నేనున్నాను..అంటూ ధైర్యం చెప్పి తనే స్వయంగా గర్భిణీని  ఆటోలో  ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి ..రెండు రోజులుగా దగ్గర ఉండి..ప్రభుత్వం డాక్టర్లతో కాన్పు చేయించగా ..ఆ గర్భిణీ కి పండంటి బాబు పుట్టడంతో ..ఆస్పత్రిలో..అందరూ ..అంగన్వాడీ ఆయమ్మను ..పొగడగా...ఈ మానవీయ సంఘటన ను ఐసిడిఎస్ పిడి ద్వారా శనివారం రాత్రి 10:30 గంటలకు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్.. అంగన్వాడీ ఆయమ్మ సహాయ స్పూర్తిని మెచ్చుకుంటూ..రూ.20,000 ల నగదు అవార్డును, ప్రశంసా పత్రాన్ని మీడియా ప్రకటన ద్వారా ప్రకటించారు.


వివరాలలోకెళితే ..కర్నూలు నగరంతో పాటు అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నంద్యాలలో ఒక వైపు కరోనా కేసులు..మరో వైపు లాక్ డౌన్ పటిష్ట0గా అమలు.. ఈ తరుణంలో సాయనికి పిలిచినా సందేహించే..పరిస్థితిలో షరాఫ్ బజార్ సుంకులమ్మ వీధిలో ఉన్న దివ్యభారతి అనే నిండు గర్భిణీ కి శుక్రవారం నాడు పురిటి నొప్పులు రాగా.. లాక్ డౌన్ వల్ల కర్నూలు లో ఉన్న తన తల్లి రాలేకపోవడంతో ..దిక్కుతోచని స్థితిలో ..తాను ఆరోగ్య పరీక్షల కోసం అప్పుడపుడూ.. వెళ్లే సుంకులమ్మ వీధి అర్బన్ అంగన్వాడీ కేంద్రం ఆయా చెన్నమ్మ గుర్తొచ్చి..సాయం చేయాలని అడిగిన తక్షణమే.. కరోనా..నై.. లాక్ డౌన్ నై.. సాయనికి సై అంటూ మానవత్వం తో వెంటనే స్పందించి.. తనకు తెలిసిన ఒక ఆటోలో నిండు గర్భిణీ దివ్యభారతి ని ఎక్కించుకుని.. అమ్మలా నేనున్నాను అంటూ ..ఆయమ్మ  సరాసరి..నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్ళి, డాక్టర్లతో పరీక్షలు చేయించి..శుక్రవారం నుండి తనతో పాటు ఆస్పత్రిలో నే ఉండి శనివారం ఉదయం 11:30 గంటలకు దగ్గర ఉండి ..ప్రభుత్వ డాక్టర్ తో కాన్పు చేయించగా ..దివ్యభారతి..4 కేజీల బరువున్న  పండంటి బాబు కు జన్మనివ్వగా ...తనకు పునర్జన్మ ఇచ్చిన అంగన్వాడీ ఆయా చెన్నమ్మ కు ఆనంద భాష్పాలతో..కృతజ్ఞత తెలుపగా..డాక్టర్లతో పాటు సిబ్బంది కూడా చెన్నమ్మ మానవతను పొగడగా...ఈ విషయాన్ని శనివారం రాత్రి 10:30  గంటలకు ఐసిడిఎస్ పిడి భాగ్యరేఖ ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అంగన్వాడీ ఆయా చెన్నమ్మ మానవీయ.. మంచి మనసు జిల్లా ప్రజలందరిలో స్పూర్తిని నింపాలని తక్షణమే రూ.20,000 ల నగదు బహుమతిని, ప్రశంసా పత్రాన్ని మీడియా ప్రకటన ద్వారా ప్రకటించి..అంగన్వాడీ ఆయా చెన్నమ్మ ను కలెక్టర్ అభినందించారు. దివ్యభారతి కాన్పు అయిన తరువాత కూడా శనివారం రాత్రి కూడా  ఆయా చెన్నమ్మ  నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నే ఉండి తన భార్యను అమ్మలా చూసుకుంటూ ఉన్న ఆయమ్మ చెన్నమ్మ ను బంగారు పని చేసుకునే రోజూ కూలీ దివ్యభారతి భర్త హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image