_మాస్కులు ధరించకుండా ఇల్లు దాటితే శిక్షార్హులే - కృష్ణ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

*కృష్ణ జిల్లా*


_మాస్కులు ధరించకుండా ఇల్లు దాటితే శిక్షార్హులే - కలెక్టర్ ఇంతియాజ్


★ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని లేని పక్షంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ . ఎండి . ఇంతియాజ్ తెలిపారు.


★ కరోనా నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై  కలెక్టర్ ఇంతియాజ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.


_*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...*_


★ ప్రజా ఆరోగ్యాన్ని , కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.


★ ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి మూడు చొప్పున మాస్కులు అందించనున్నట్లు చెప్పారు.


★ మాస్కు ధరిస్తే తమతో పాటు తమ కుటుంబ సభ్యులు , తమ పొరుగువారు కూడా సురక్షితంగా ఉంటారన్నారు. దానితో పాటు వారి శ్రేయస్సును కోరిన వారవుతారన్నారు.


★ జిల్లాలో రెడ్ జోన్ గా ఉన్న విజయవాడ , పెనమలూరు . గొల్లపూడి , జగ్గయ్యపేట , మచిలీపట్నం , నూజివీడు మండలాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆయన కోరారు.


★ మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.


★ ముఖ్యమంత్రి వై . యస్ . జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి కుంటుంబంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున అందిస్తామన్నారు.


★ రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముందుగా పంపిణీ చేస్తామని చెప్పారు.


★ జిల్లా వ్యాప్తంగా మాస్కుల పంపిణీకి డ్వామా , డిఆర్డిఎ ఆధ్వర్యంలో స్వయం సహాయ సంఘాల ద్వారా పెద్ద ఎత్తున మాస్కులు తయారీ చేపట్టామన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image