జేవీవీ చేస్తున్న సేవలు అమోఘం

*జేవీవీ చేస్తున్న సేవలు అమోఘం
కరోనా అనే వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న జనవిజ్ఞానవేదిక సేవలు అభినందనీయం అని వరికుంటపాడు తహసీల్దార్ చేవూరి శ్రీనివాసులు కొనియాడారు. వరికుంటపాడు మండల జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మంగళవారం జి కొండారెడ్డిపల్లి లో నిరుపేద లు అయిన 120 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి బస్తా చెప్పున 120 బస్తా లు బియ్యం పంపిణి చేసారు, ఈ సందర్భంగా జనవిజ్ఞానవేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమిత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ప్రస్తుత పరిస్థితులు లో ప్రభుత్వం అమలు చేస్తున్న సూచనలు సలహాలు పాటించాలని అన్నారు. అనంతరం నాలుగు వందల మాస్క్ లను పంపిణి చేసారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సురేష్ కుమార్,  ఎస్ఐ ఉమా శంకర్, ఏఎంసీ చైర్మన్ అలీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ గుంటుపల్లి ఆంజనేయులు మండల వైసీపీ కన్వీనర్ మందలపు తిరుపతినాయుడు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బోగినేని శ్రీనివాసులు, జేవీవీ సీనియర్ నాయకులు వెంకట సుబ్బయ్య, జేవీవీ ఉపాధ్యక్షులు డీవీ రమణయ్య, జేవీవీ నాయకులు నాదెండ్ల రమణయ్య, మాల్యచలం పంచాయతీ కార్యదర్శి శివ కుమార్, వాలంటీర్స్ పాల్గొన్నారు


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు