వై.సి.పి నాయకులు పండ్లు , కూరగాయలు పంపిణీ


శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం : 


మున్సిపల్ పరిధి చెన్నూరు హరిజనవాడ లో రెక్కడనిదే డొక్కాడని గ్రామ ప్రజలకు పండ్లు , కూరగాయలు పంపిణీ చేశారు.


నెల రోజుల నుండి లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న చెన్నూరు హరిజనవాడ లో నిరుపేద కుటుంబాలకు 
వై.సి.పి నాయకులు గూడూరు రాజారెడ్డి , కందలి మురళి రెడ్డి , శ్రీకి రెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో 200 వందల మంది నిరుపేద కుటుంబాలకు డోర్ టు డోర్ వాలంటరీ సమక్షంలో పండ్లు , కూరగాయలు పంపిణీ చేశారు.
గ్రామ ప్రజలు మాట్లాడుతూ
కరోనా మహమ్మారి వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు , లాక్ డౌన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావటంతో , గ్రామంలో దాతలు ముందుకు వచ్చి నిరుపేద కుటుంబాలకు గట్టెక్కిస్తున్నారని గ్రామ ప్రజలు కొనియాడారు.


ఈ కార్యక్రమంలో గోవర్ధన్ , వాలంట్రీలు సురేఖ , సుమతి , కల్పన , వెంకటకృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.