కరోనా అదుపునకు  ఎంపీ ఆదాల ఆర్థిక సాయం

కరోనా అదుపునకు  ఎంపీ ఆదాల ఆర్థిక సాయం



 ఎంపీలాడ్స్ నుంచి కోటి రూపాయలు 


సొంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలు



 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా అదుపు సహాయక చర్యలకు గాను నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నడుం కట్టారు. తన ఎంపీ నిధుల నుంచి కోటి రూపాయలను ప్రభుత్వానికి కేటాయించారు. తన సొంత నిధుల నుంచి 20 లక్షల రూపాయలను అందించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి ద్వారా 20 లక్షల రూపాయల నిధులను జిల్లా కలెక్టర్ కు అందించాలని కోరారు. అందులో భాగంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి బుధవారం 20 లక్షల రూపాయల సహాయనిధి చెక్కును జిల్లా మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ లకు నెల్లూరులో అందించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ వెంకయ్య, రూప్ కుమార్ యాదవ్, నిజాముద్దీన్ లు పాల్గొన్నారు. ఈ నిధులను కరోనా అదుపునకు వినియోగించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. కరోనాను నిరోధించే మాస్కులకు, సానీటై జర్లకు, ఇతరత్రా సహాయ చర్యలకు ఉపయోగించాలని తెలిపారు. సామాజిక భద్రతకు భంగం గా పరిణమించిన కరోనా ను పారదోలడానికి ఈ నిధుల వినియోగం జరగాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు భద్రత చేకూరాలని, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు ఇబ్బంది పడకుండా చూడాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తద్వారా సామాజిక సంక్షేమం చేకూరాలన్నదే తన అభిమతమని తెలిపారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నలుగురిని ఇలా 'ఉరి' తీశారు