ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో శ్రీనాథ్ ,గూడూరు సబ్ రిజిస్ట్రార్  శ్రీమతి భానుమతి దంపతుల  సహకారంతో మరియు గ్రానైట్ ప్రభాకర్ సహకారంతో ఈరోజు    మంగళవారం విగ్నేశ్వర పురంలోని నిరుపేదలైన 25 కుటుంబాలకు, ఓం సాయి రామ్ చారిటీస్ వృద్ధాశ్రమానికి, గమళ్ల పాలెంలో ఉన్న  ఐస్ క్రీమ్ అమ్ముకునే నార్త్ ఇండియన్స్ 10 కుటుంబాలకి కూరగాయల పంపిణీ నిర్వహించడమైనది. మున్సిపల్ కమిషనర్ ఓబులేసు  చేతుల మీదగా అందించడం అయినది .అధ్యక్షుడు కడివేటి  చంద్రశేఖర్, సెక్రెటరీG. చంద్రశేఖర్, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,శ్రీనాథ్ ,  గ్రానైట్ ప్రభాకర్, ఆలీ, శ్యామ్, మస్తానయ్య,గ్రూప్ లీడర్ నాగేశ్వర్ రావు,వార్డు వాలంటీర్లు షహనాజ్, కల్పన,కాటమ్మ,  ఆశావర్కర్లు సూర్యావతి తదితరులు పాల్గొన్నారు