మాజీ ఎమ్మెల్యే సునీల్ చే ప్రగతి సేవా సంస్థ నిత్యావసర వస్తువులు పంపిణీ


  గూడూరు, ఏప్రిల్ 28,(అంతిమ తీర్పు) : ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో  బెల్జియం లో ఉన్న సాఫ్టువేర్ ఇంజనీర్ అనీస్ మరియు వాళ్ళ స్నేహితుల సహాయ సహకారలతో  ఈరోజు 28.4.2020వ తేదీన చిల్లకూరు మండలం నక్కల వారి కండ్రిగ గిరిజన కాలనీ నందు  570/- విలువుగల నిత్య అవసర ఫల సరుకులను నిరుపేదలు అయిన 30 కుటుంబాలకు మాజీ శ్యాసన సభ్యులు పాశం సునీల్ కుమార్  చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం, గ్రానైట్ ప్రభాకర్, కరిముల్లా, ఉదయ్ శేఖర్ రెడ్డి,  సతీష్ తదితరులు పాల్గొన్నారు.