కమిషనర్ చే ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో కార్మికులు కు కూరగాయలు పంపిణీ

    గూడూరు ఏప్రిల్ 29,(అంతిమ తీర్పు) :   ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో నెల్లూరు కార్పొరేషన్ లో వర్క్ చేస్తున్న రవి కుమార్ సహాయ సహకారాలతో   ఈరోజు 29.4.2020వ తేదీన గూడూరు లోని మిలిటరీ కాలనీ లో సచివాలయం వాలంటీర్స్ కు, ఆశ వర్కర్స్ కు, పారిశుధ్య కార్మికులు 50 కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. గూడూరు మునిసిపల్ కమిషనర్ ఓబులేసు గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, ఉప అధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ యమహా సుబ్రహ్మణ్యం,ప్రజేంద్ర రెడ్డి, కరిముల్లా, శ్యామ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.