కృష్ణా  జిల్లాలో  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం

కృష్ణా  జిల్లాలో  ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకం ప్రారంభం



విజయవాడ: స్వయం సహాయ బృందాలకు ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో  రాష్ట్ర మంత్రులు పేర్ని వెంకట్రామయ్య( నాని),వెల్లంపల్లి శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 8.23 లక్షలకు పైగా మహిళల ఖాతాల్లోకి రూ.69.33 కోట్లు జమ అవుతాయి.సెర్ప్ పరిధిలో 52,498 సంఘాలకు చెందిన( 6.32 లక్షల మంది ) పొదుపు ఖాతాలకు రూ.40.94 కోట్లు, మెప్మా పరిధి ప్రాంతాల్లోని 17,755 పొదుపు ఖాతాలకు ( 1.90 లక్షల మంది) రూ.28.39 కోట్లు ఒకేసారి వడ్డీ సొమ్మును ప్రభుత్వం జమ చేసింది.ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, కలెక్టర్ ఏ. యండి.ఇంతియాజ్, డిఆర్డి ఎ పిడి శ్రీనివాసరావు, మెప్మా పిడి ఎన్. ప్రకాశరావు ,జిల్లా సమాఖ్య, మెప్మా సంఘాల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image