ఎపిలో మూడోవిడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం

29.4.2020
అమరావతి 


- ఎపిలో మూడోవిడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం


-  బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ కందిపప్పు. 


- రాష్ట్ర వ్యాప్తంగా 43,685 రేషన్ దుకాణాల కౌంటర్ల ద్వారా జరుగుతున్న  పంపిణీ 


- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాలకు అదనంగా 15,331 కౌంటర్లు 



- 13 జిల్లాల్లో బియ్యంకార్డు వున్న 1,47,24,017 కుటుంబాలకు లబ్ది.



- కొత్తగా దరఖాస్తు చేసుకున్న 81,862 పేద కుటుంబాలకు కూడా ఉచిత రేషన్. 


- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు చేయూత. 


- కేంద్రప్రభుత్వ నిబంధనలతో కార్డుదారుల బయో మెట్రిక్ తప్పనిసరి



- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు 


- సరుకులు తీసుకునే ముందు, ఆ తరువాత కూడా శానిటైజ్ చేసుకోవాలి. 


- భౌతికదూరంను పాటిస్తూ రేషన్ తీసుకునేందుకు టైం స్లాట్ కూపన్లు. 


- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునే వెసులుబాటు.