దివంగత కె.చంద్రమౌళి కి వైఎస్ఆర్ సిపి ఎంపిల నివాళి


అమరావతి
18.4.2020


దివంగత కె.చంద్రమౌళి కి వైఎస్ఆర్ సిపి ఎంపిల నివాళి


వైయస్ఆర్ సీపీ నాయకుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కే.చంద్రమౌళి పార్థివ కాయాన్ని వై ఎస్ ఆర్ సి పి రాజంపేట, చిత్తూరు పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రెడ్డప్పలు సందర్శించారు. మృతదేహం వద్ద పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. హైదరాబాదులోని చంద్రమౌళి నివాసంకు వెళ్లిన ఎంపిలు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిత్తూరు జిల్లా కుప్పం వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా పోటీ చేసి చేసిన కే. చంద్రమౌళి బీసీ సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా, బలహీన వర్గాల ప్రజలకు ఎంతో సేవ చేశారని ఈ సందర్భంగా వారు కొనియాడారు. సివిల్ సర్వెంట్ గా పలు జిల్లాల్లో పనిచేసిన సందర్భంలోనూ కే. చంద్రమౌళి ప్రభుత్వ పథకాలను నిరుపేదలకు చేరువ చేయడంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ఐఏఎస్ అధికారిగా అటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతూ అనునిత్యం ప్రజలకు సేవ చేయాలనే తపనతోనే ఆయన పనిచేశారని అన్నారు. ఐఎఎస్ అధికారిగా తన పదవీ విరమణ తరువాత వైఎస్ఆర్సిపి ద్వారా కుప్పం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన కృషి చేశారని కొనియాడారు. చంద్రమౌళి మరణం చిత్తూరు జిల్లాకి తీరనిలోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.


*మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం*


వైఎస్ఆర్ సిపి కుప్పం నియోజక ఇన్ చార్జి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.చంద్రమౌళి మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లాలో క్రియాశీలక నాయకుడిగా ఆయన వైఎస్ఆర్సిపిలో ప్రధాన భూమిక పోషించారని, ఆయన మరణం జిల్లావాసులకు తీరని లోటని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ధైర్యంగా నిలబడిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు. ఐఏఎస్ అధికారిగా ఆయన అందించిన సేవలు సైతం ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటున్నారని, ఆయన మరణం బాధాకరమని ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..