పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి

*విశాఖ ఏజెన్సీ /పాడేరు,అరుకు , ఏప్రిల్ 26 :


 పారమెడికల్ సిబ్బందికి వేతనాలు చెల్లించాలి


 *వైద్య ఆరోగ్యశాఖ విశాఖ ఏజెన్సీ,ఆయా పి.ఎచ్.సి పరిధిల్లో 2017 సం.నుండి* *కాంట్రాక్టు వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న*
*ఏ.ఎన్.ఎమ్,హెల్త్ అసిస్టెంట్స్,ఫార్మసీస్ట్స్,స్టాఫ్ నర్స్(పారా మెడికల్* *సిబ్బందికి)గత ఫిబ్రవరి నెలల నుండి మూడు జీతాలు అందక* 
*కంటతడితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు*


 *"కరోన వైరస్"కి తీసుకోవలసిన జాగ్రత్తలు మరియుసర్వే నిమిత్తం,* 
*తమ ప్రాణాలను సైతం లెక్క చెయ్యకుండ బార్యపిల్లలను,* *అమ్మా,నాన్నలను,విడిచి పెట్టి*
 *ఊరురు కొండ కోనలు సైతం లెక్క చెయ్యకుండా ప్రాణం అడ్డంగా పెట్టి తిరిగి,తిరిగి కరోన వైరస్ గురించి ఏజెన్సీ గ్రామాల్లో గల ప్రజలు తగు* *జాగ్రత్తలు పాటించాలి, జాగ్రత్తగా ఉండాలని,పలు* 
*ఏజెన్సీ 11 మండల పరిధిలో గల ఆయా గ్రామాల ప్రజలకు* 
*అవగాహన కల్పించి వివరిస్తున్నారు*


*మరి కొంతమంది సిబ్బందైతే వాహనాలు నడవని* *ప్రాంతాలకు ఎండనక,వానానక పట్టించుకోకుండా కాలినడకతో వెళ్లి వెళ్లి కరోన మహమ్మారి గురించి అవగాహన* *కల్పిస్తున్నారు.*


  *కానీ నేటి వరకు ఆరోగ్య శాఖ వారు కానీ ప్రభుత్వం కానీ*
   *వీల్లా జీతభత్యాల విషయాలపై పట్టించుకోక పోవడం చాల బాధాకరమైన విషయం*రోజుకి విధులకు వెళ్ళడానికి చేతికి రవాణా ఛార్జీలకు కూడ *నయా పైసా* *లేవని భాద పడుతున్నారు*.


*విధి నిర్వహణలో జరగరానిది జరిగితే తమ భార్య పిల్లల పరిస్థితి ఏమిటని,తమకెమైన అయితే తమ బార్య పిల్లలకు దిక్కేవరని,పరిస్థితి ఏమిటని ఈ సిబ్బంది కంటతడి పెడుతూ తమ బకాయి వేతనాలు విడుదల చెయ్యాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*