జ‌ర్న‌లిస్టు మిత్రుల‌కు హెచ్చ‌రిక‌


"జ‌ర్న‌లిస్టు మిత్రులారా కోవిడ్ హాస్పిట‌ల్‌, హాస్పిట‌ల్ క్వారంటైన్‌ల‌కు ఎవ‌రూ వెళ్ల‌కండి. ఇప్ప‌టికే మూడు రాష్ట్రాల్లో జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా వైర‌స్ సోకిన విష‌యం తెలిసిందే. ముంబైలో ఓ చాన‌ల్‌లో ప‌ని చేస్తున్న జ‌ర్న‌లిస్టులంద‌రికీ క‌రోనా సోకింది. జ‌ర్న‌లిస్టుల‌కు క‌రోనా పాజిటివ్ అని తేలితే ఏ ప్ర‌భుత్వ‌మూ, యాజ‌మాన్య‌మూ ఆదుకోవు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని వ‌ర్గాల‌కు ప్ర‌భుత్వాలు ప్యాకేజీలు ప్ర‌క‌టించాయి. జ‌ర్న‌లిస్టుల‌కు మాత్రం ప్ర‌త్యేకంగా ఏమీ ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌క‌టిస్తార‌ని కూడా ఆశ‌లేదు. కావున క‌రోనాకు గురి కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఒక్క‌టే ప‌రిష్కారం" అని రెండురోజులుగా సోష‌ల్ మీడియాలో బాగా చ‌క్క‌ర్లు కొడుతున్న అంశ‌మిది.
తమిళనాడులోని ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో విధులు నిర్వర్తిస్తున్న 27 మంది జర్నలిస్ట్‌లకు కరోనా పాజిటివ్‌గా తేల‌డం, అలాగే ముంబైలో రిపోర్ట‌ర్లు, కెమెరామెన్ల‌ను క‌లుపుకుని మొత్తం 53 మందికి క‌రోనా సోకింది. తెలంగాణ‌లో కూడా ప్ర‌ముఖ న్యూస్ చాన‌ళ్ల రిపోర్ట‌ర్లు, కెమెరామెన్లు, వారి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అనే వార్త‌లొచ్చాయి.
ఈ నేప‌థ్యంలో జ‌ర్న‌లిస్టులుగా తామెందుకు క‌రోనా పాజిటివ్ బాధితుల ద‌గ్గ‌రికి వెళ్లి, కోరి కోరి జ‌బ్బు తెచ్చుకోవాల‌నే ఆలోచ‌న మొద‌లైంది. అంతేకాదు, గ‌తంతో పోలిస్తే అస‌లు జ‌ర్న‌లిజం అనేదే లేద‌ని చెప్పొచ్చు. ఒక ప్ర‌ముఖుడి మాట‌ల్లో చెప్పాలంటే...మీడియా ఫోర్త్ ఎస్టేట్ కాదు రియ‌ల్ ఎస్టేట్‌. మీడియాలో ప్ర‌స్తుత ధోర‌ణ‌లు చూస్తుంటే ఇది ఎంత చేదు నిజ‌మో క‌దా అనిపిస్తుంది. రియ‌ట్ ఎస్టేట్‌లో నిల‌దొక్కుకోగ‌లిగితేనే...ఫోర్త్ ఎస్టేట్‌లో నిల‌దొక్కుకునే ప‌రిస్థితులు దాపురించాయి.
జ‌ర్న‌లిస్టుల బ‌తుకులు వ‌ల‌స కూలీల‌కు ఎక్కువ‌, ఉపాధి కూలీల‌కు త‌క్కువ. కేవ‌లం జ‌ర్న‌లిజాన్నే ఉపాధి చేసుకున్న వాళ్ల కుటుంబాలకు పూట‌గ‌డ‌వ‌ని స్థితి. మ‌రికొంద‌రు మీడియా రంగంలో ఉద్యోగులుగా స్థిర‌ప‌డిన‌ప్ప‌టికీ....మిగిలిన రంగాల‌తో పోలిస్తే జీత‌భ‌త్యాల్లో న‌క్క‌కు, నాగ‌లోకానికి ఉన్నంత తేడా. జ‌ర్న‌లిజంలో 30 ఏళ్లు సేవ చేసినా  జీతం (ఈనాడు మిన‌హా) రూ.20 వేల‌కు కూడా చేర‌ని దుర్మార్త‌మైన రంగం ఇది.
చాలా మంది రిటైర్డ్ అయ్యే నాటికి కూడా రూ.20 -22 వేల‌కు మించి తీసుకున్న వాళ్లు లేరు. జ‌ర్న‌లిజం అనేది ఓ మ‌త్తు. ఆ ఊబిలోకి దిగితే బ‌య‌ట‌ప‌డ‌టం క‌ష్టం. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా న‌డివ‌య‌స్సులో ఉద్యోగాలు పోగొట్టుకున్న జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి అగమ్యం.
ఆంధ్ర‌జ్యోతిలో ఉద్యోగుల‌ను తొల‌గించినా, ఉన్న‌వాళ్ల వేత‌నాల్లో 20 శాతం కోత విధించినా, అలాగే ఈనాడులో  ఉద్యోగుల‌ను జీతం లేని దీర్ఘ‌కాలిక సెల‌వుపై ఇళ్ల‌కు పంపినా...వాటి ప్ర‌త్య‌ర్థి ప‌త్రిక సాక్షి ఒక్క అక్ష‌రం కూడా రాయ‌దు. ఎందుకంటే సాక్షి కూడా త‌న ఉద్యోగుల మెడ‌పై గిలిట‌న్ (ఫ్రెంచి విప్ల‌వ కాలంలో ప్రాచుర్యంలోకి వ‌చ్చిన త‌ల న‌రికే యంత్రం) వేలాడ‌దీస్తోంది.  
ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ క‌రోనా క‌ట్ట‌డికి కొన్ని రంగాల ప్ర‌ముఖుల స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మీడియా రంగానికి సంబంధించిన ప్ర‌ముఖుల నుంచి కూడా ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు. ఇక్క‌డ జ‌ర్న‌లిస్టులు బాగా గుర్తించాల్సిన విష‌యం ఒక‌టి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడారు.
రామోజీ, ఆర్‌కే ఎవ‌రు?  మీడియా సంస్థ‌ల అధిప‌తులు. ఈనాడు చీఫ్ ఎడిట‌ర్‌గా రామోజీ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు త‌మ ఎడిట‌ర్ల‌ను ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌కు ఎందుకు పంప‌లేదు? జ‌ర్న‌లిస్టులంటే గొప్ప మేధావుల‌మ‌ని విర్ర‌వీగే మ‌నం ఎప్పుడైనా ఆ విష‌య‌మై ఒక్క క్ష‌ణ‌మైనా ఆలోచించామా? ఆలోచించ‌లేదు, ఆలోచించం కూడా. ఎందుకంటే దేశాన్ని ఉద్ధ‌రించే రంగంలో ఉన్నామ‌నే మాయ‌లో మ‌న గురించి మ‌నం, మ‌న కుటుంబ గురించి ఏనాడూ ఆలోచించ‌డానికి ఇష్ట‌ప‌డం.
అందుకే ప‌త్రికా యాజ‌మాన్యాల‌కు జ‌ర్న‌లిస్టులంటే అంత చుల‌క‌న‌. త‌మ వ‌ల్లే జ‌ర్న‌లిస్టులు బ‌తికిపోతున్నార‌ని ప‌త్రికా యాజ‌మాన్యాలు భావిస్తుండ‌టం వ‌ల్లే ఎడిట‌ర్ మొద‌లుకుని మండ‌ల స్థాయి విలేక‌రి వ‌రకు ...ఎవ‌ర్నీ మీడియా యాజ‌మాన్యాలు లెక్క‌పెట్ట‌వు. ఇందుకు నిద‌ర్శ‌నం ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌కు ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు త‌మ ఎడిట‌ర్ల‌ను పంప‌క పోవ‌డ‌మే.
ఇక్క‌డో విష‌యం చెప్పుకోవాలి. కేఎన్‌వై ప‌తంజ‌లి అని ఓ గొప్ప ర‌చ‌యిత‌, సంపాద‌కుడి పేరు వినే ఉంటారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, సంపాద‌కుడు అయిన ప‌తంజ‌లి బ‌తక‌డం కోసం ప‌చ్చ‌ళ్లు చేసి హైద‌రాబాద్ న‌గ‌ర వీధుల్లో అమ్ముకోవాల్సి వ‌చ్చింది. ఎడిట‌ర్ల ప‌రిస్థితే ఇంత దారుణంగా ఉంటే, ఇక కిందిస్థాయి జ‌ర్న‌లిస్టుల జీవితాలు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించ‌లేం. ఆయ‌న ఇప్పుడు మ‌న మ‌ధ్య లేరు. 1983లోనే ఆయ‌న పెంపుడు జంతువులు అనే ఓ న‌వ‌ల రాశారు. ఇది పూర్తిగా జ‌ర్న‌లిస్టుల గురించి రాసిందే. ఈ న‌వ‌ల‌లో ఎడిట‌ర్ పాత్ర గురించి ప‌తంజ‌లి అద్భుతంగా చెబుతారు. ఏమ‌ని అంటే...ఎడిట‌ర్‌కు ఎడిట‌ర్ ఉద్యోగం కావాలే త‌ప్ప‌, ప‌త్రిక‌ల‌కు ఎడిట‌ర్ అవ‌స‌రం లేద‌ని. ఎందుకంటే ఎప్పుడైతే ప‌త్రిక‌ల్లో వాణిజ్య రంగానిది పైచేయి అయ్యిందో అప్పుడే ప‌త్రిక‌లు చ‌చ్చిపోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తారాయ‌న‌.
ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ కె.శ్రీ‌నివాస్ ఎంత గొప్ప జ‌ర్న‌లిస్టు మ‌నంద‌రికీ తెలుసు. కె.శ్రీ‌నివాస్‌కు సాహిత్యంతో స‌మాజ ప‌రిణామ క్ర‌మంపై లోతైన అవ‌గాహ‌న ఉంది. క‌రోనా అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల‌పై ఇటీవ‌ల ఆయ‌న అద్భుత‌మైన వ్యాసం రాశారు. అలాగే క‌రోనా క‌ట్ట‌డికి ఏం చేయాలో ఆయ‌న ద‌గ్గ‌ర మాస్ట‌ర్ ప్లాన్ ఉండే ఉంటుంది. క‌రోనా విప‌త్తులో సామాన్య జ‌నం ఇక్క‌ట్ల గురించి ఆయ‌న‌కు బాగా తెలుసు. ప్ర‌ధానితో కె.శ్రీ‌నివాస్ లాంటి ఎడిట‌ర్లు మాట్లాడితే స‌మాజానికి మంచి జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌. కానీ ఆయ‌న‌తో మాట్లాడించే వాళ్లెవ‌రు?
జ‌ర్న‌లిజం విలువ‌ల గురించి య‌జ‌మానులు మాట్లాడ్డ‌మే విచిత్రం. అంతెందుకు కరోనా మ‌హ‌మ్మారిని సాకుగా చూపి వంద‌ల సంఖ్య‌లో త‌మ‌త‌మ ప‌త్రిక‌ల నుంచి తొల‌గిస్తూ...ఉద్యోగుల పాలిట క‌రోనా వైర‌స్‌లైన ప‌త్రికాధిప‌తుల‌తో క‌రోనా క‌ట్ట‌డిపై ప్ర‌ధాని మాట్లాడ‌టం విచిత్రం.
కావున జ‌ర్న‌లిస్టు మిత్రులారా...మ‌న మీడియా సంస్థ‌ల్లో ఎడిట‌ర్ల‌కే దిక్కులేదు. అలాంట‌ప్పుడు ఎక్క‌డో మారుమూల మండ‌లి స్థాయి మొద‌లుకుని ప‌ట్ట‌ణాల్లో ప‌నిచేసే విలేక‌రుల‌కు, స్టాప్‌రిపోర్ట‌ర్ల‌కు, బ్యూరో ఇన్‌చార్జ్‌ల‌కు ఈ యాజ‌మాన్యాలు కిరీటాలు పెడుతాయ‌నే భ్ర‌మ నుంచి ఎంత త్వ‌ర‌గా బ‌య‌టికొస్తే అంత మంచిది. క‌రోనా పుణ్య‌మా అని జ‌ర్న‌లిస్టుల క‌ళ్ల‌లో మ‌బ్బులు ఇప్పుడిప్పుడే తొల‌గిపోతున్నాయి.
బ‌తికి ఉంటే ఏ యూట్యూబ్ చాన‌లో, వెబ్‌సైట్‌కో రాస్తూ...ఇంత‌కంటే సుఖ‌ప్ర‌ద‌మైన జీవితాన్ని గ‌డిపే అవ‌కాశం ఉంటుంది. కావున ప్ర‌స్తుత ఈ ప‌త్రిక‌లు, చాన‌ళ్ల‌లో భ‌విష్య‌త్‌ను చూసుకోవ‌డం అంటే ఎండ‌మావ‌ళ్ల‌లో నీటి త‌డిని వెతుక్కోవ‌డ‌మే అవుతుంది.
ఇప్ప‌టికైనా జ‌ర్న‌లిస్టు మిత్రులు త‌మ ఆర్థిక స్థితిగ‌తుల‌ను స‌రిదిద్దుకోవాలి. క‌రోనా అనేది విప్ల‌వాత్మ‌క ప్ర‌క్షాళ‌న కోసం వ‌చ్చింద‌నే పాజిటివ్ దృష్టి కోణంలో ఆలోచించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. వ్య‌వ‌స్థ‌లో చోటు చేసుకోబోతున్న పెనుమార్పుల‌ను మ‌న జీవిక‌కు అనుగుణంగా ఎలా మ‌లుచుకోవాలో సీరియ‌స్‌గా ఆలోచించాలి. అందుకు అనుగుణంగా జ‌ర్న‌లిస్టులు స‌రైన‌ అడుగులు వేయాల‌ని హెచ్చ‌రించేందుకు ఓ జ‌ర్న‌లిస్టుగా రాసిందే ఈ ఆర్టిక‌ల్‌.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image