సలహాదారు పదవులకు సెలవు?

సలహాదారు పదవులకు సెలవు?
వలంటీర్ల వ్యవస్థకూ మంగళం?
ఆర్ధిక భారం తప్పించేందుకేనా?
విపక్షాల విమర్శలకు తెర
జగన్ సంచలన నిర్ణయం?
ఆర్ధిక సంక్షోభంలో ఉన్న ఖజానాను గట్టెక్కించేందుకు,   ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా.. ఖజానాకు భారంగా పరిణమించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, వలంటీర్ల వ్యవస్థను తొలగించనున్నట్లు సమాచారం. ఫలితంగా వేల కోట్ల రూపాయలు ఆదా చేయవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం. ఒక అధికారి ఇచ్చిన సలహా మేరకు జగన్మోహన్‌రెడ్డి త్వరలో ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అంత సంతృప్తికరంగా కాకపోయినా, ఓ మోస్తరు ఆదాయం ఉండేది. ప్రధానంగా లిక్కర్ నుంచి అధిక ఆదాయం లభించేది. జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్‌షాపులు రద్దు చేసి, ప్రభుత్వమే లిక్కర్‌షాపులు నిర్వహించే వ్యవస్థను ఏర్పాటుచేసింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు కూడా దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటివరకూ  దాదాపు 38 మందిని ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. అదేవిధంగా 2,39,159మందిని వలంటీర్లుగా నియమించారు. వీరి జీతభత్యాలకు వేల కోట్లు ఖర్చవుతున్నాయి. సలహాదారులకు నెలకు, 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. వీరిలో ఎక్కువగా రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారు. వీరి జీతభత్యాలు, వారి వద్ద పనిచేసే ఉద్యోగుల వేతనాలకు, సుమారు కోటిన్నర వరకూ ఖర్చవుతోంది. అయితే నిజానికి వీరు ఇస్తున్న సలహాలు గానీ, వాటిని జగన్మోహన్‌రెడ్డి పాటిస్తున్న దాఖలాలు గానీ లేవు. ఎంతోమంది సలహాదారులున్నప్పటికీ.. సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్‌కల్లం, పి.వి.రమేష్ వంటి అతికొద్దిమంది మాత్రమే చురుకుగా పనిచేస్తున్నారు.
అయితే, ఇటీవలే ఎయిమ్స్‌లో పనిచేసే డాక్టర్ శ్రీనాధ్‌రెడ్డికి ఎలాంటి జీతం లేకుండా, ఉచిత సేవలందిస్తున్నందుకు ఆయనను వైద్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వు లిచ్చారు. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్ధిక భారం పడదు. దీనికి సంబంధించి ఒక ఉన్నతాధికారి.. జగన్మోహన్‌రెడ్డికి సలహాదారుల వేతనాలపై ఒక సూచన చేసినట్లు సమాచారం. ఆ ప్రకారంగా.. ప్రస్తుతం ఉన్న సలహాదారులను తొలగించడం గానీ, లేదా డాక్టర్ శ్రీనాధ్‌రెడ్డి మాదిరిగా ఉచిత సలహాలు ఇస్తూ సలహాదారులుగా కొనసాగాలా అన్న విషయాన్ని వారికే విడిచిపెట్టాలని, సదరు అధికారి జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు చెబుతున్నారు. నిజంగా సలహాదారులకు వేతనాలు లేకుండా, కొనసాగించడం వల్ల ఖజానాకు కోట్లాది రూపాయలు మిగులుతాయంటున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న 2,39,159 మంది వలంటీర్లను కూడా తొలగించడం ద్వారా, వేయి కోట్ల రూపాయల ఆర్ధిక భారం తప్పుతుందని సదరు అధికారి, జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. గ్రామ వలంటీర్లకు 720 కోట్లు, మున్సిపల్ వలంటీర్లకు 280 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. నిజానికి వీరి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండటం లేకపోగా, ప్రభుత్వం-పార్టీ అనవసర ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోందటున్నారు. కరోనా నేపథ్యంలో రేషన్‌కార్డులు ఉన్నవారికి, ఇంటికే రేషన్ పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ వెల్లడించింది. అయితే, అది సాధ్యం కాదని మంత్రి కొడాలి నాని చెప్పడం గందరగోళానికి దారి తీసింది. ప్రతిపక్షాలు కూడా వలంటీర్లకు నెలకు 5 వేల రూపాయలు ఇస్తున్నప్పుడు, గతంలో జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లు.. వారి ద్వారా, రేషన్ ఎందుకు పంపిణీ చేయరని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అదీ కాకుండా వలంటీర్లపై స్థానికంగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తొలగించడం వల్ల, ఖజానాపై వేయి కోట్ల భారం తగ్గిపోతుందని సదరు అధికారి జగన్మోహన్‌రెడ్డికి వివరించినట్లు సమాచారం. అదీకాకుండా.. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు, చివరకు పెన్షనర్లు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులలో కూడా కోత విధించడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం వద్ద 30 వేల కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్యోగుల జీతాల్లో కోత ఎందుకు విధించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే మెగా కృష్ణారెడ్డి కంపెనీ, మరో కంపెనీకి 6400 కోట్లు ఎలా చెల్లించారని.. ఉద్యోగులకు ఇవ్వడానికి లేని డబ్బులు, కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు ఎలా వస్తున్నాయని బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి  లోకేష్  నిలదీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టేంత స్థాయిలో,  ఖజానాలో డబ్బు లేని క్లిష్ట పరిస్థితి ఉన్నప్పుడు.. ఖజానాకు భారంగా మారిన సలహాదారులు, వలంటీర్ల వ్యవస్థను తొలగించడమే మంచిదని సదరు అధికారి, జగన్మోహన్‌రెడ్డికి సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. వీటిని రద్దు చేయడం వల్ల మిగిలే నిధులను, ఇతర అత్యవసర కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే చిన్న స్థాయి కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది.  పైగా సలహాదారుల నియామకాలపై ఇప్పటికే నలుచెరుగులా విమర్శలు వస్తున్నందున, ఈ నిర్ణయంతో వాటికీ తెరదించవచ్చని చెప్పినట్లు సమాచారం. ఒకవేళ ఈ విషయంలో ప్రతిష్ఠకు వెళితే.. డాక్టర్ శ్రీనాధరెడ్డి మాదిరిగా, ఉచితంగా సేవలందించేందుకే సలహాదారులను పరిమితం చేస్తే, కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని చెప్పినట్లు వినికిడి.  దీనిపై జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగానే స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image