పోలీసు శాఖ కు కిమ్స్ విరాళం

అమరావతి


* 07.04.2020
*కోవిడ్‌ –19 నివారణలో భాగంగా పోలీసుల శాఖ సహాయార్థం డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పోలీస్   సహాయనిధికి రూ.50,00,000 లక్షల విరాళం అందించిన  KIMS హాస్పిటల్స్  అధినేత భాస్కర్ రావు .* 
*విరాళానికి సంబంధించిన మొత్తాన్ని చెక్కు   ద్వారా గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ  శ్రీ.గౌతమ్ సవాంగ్ IPS కి మంగళగిరి లోని పోలీస్ ప్రధాన కార్యాలయం లో అందజేశారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ డీ.జీ రవిశంకర్ అయ్యన్నర్ IPS పాల్గొన్నారు.దీనిపై శ్రీ. డీజీపీ  మాట్లాడుతూ ఆరోగ్య భద్రత ద్వారా ఇప్పటికే  పోలీస్ శాఖ కు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న KIMS ఆసుపత్రి, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించిన  KIMS 
ఆసుపత్రి యాజమాన్యనికి కృతజ్ఞతలు తెలిపారు.