జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది: డాక్టర్ మాలిక్ ఎం.డి తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్

 


జర్నలిస్టుల పాత్ర ఎనలేనిది: డాక్టర్ మాలిక్ ఎం.డి
తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్స్


జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి.. 
▪️ముఖ్యమంత్రి జగన్ జర్నలిస్టులను ఆదుకోవాలి..
-మచ్చా రామలింగారెడ్డి
 జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) విజ్ఞప్తి..


👉అనంతపురం ప్రెస్ క్లబ్ లో శ్యానిటైజర్లు, సబ్బులు, మాస్కులు పంపిణీ..
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


👉జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం నగరంలోని జర్నలిస్టులకు తాహా ఆయుర్వేదిక్ హాస్పిటల్ సహకారంతో శ్యానిటైజర్లు, మాస్కులు, సబ్బులు.. జర్నలిస్టులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ మాలిక్, మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్.. పాల్గొని వారి చేతుల మీదుగా జర్నలిస్టులకు పంపిణీ కార్యక్రమం జరిగింది.


✍డాక్టర్ మాలిక్ ఎం.డి మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వార్తల సేకరణలో ఎప్పటికప్పుడు ప్రజలకు వార్తలు అందిస్తూ... ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని వారి సేవలు వెలకట్టలేనివి అని అన్నారు, మీ నాయకుడు మచ్చా రామలింగారెడ్డి ఆడిగినవెంటనే రెండు రోజుల్లోనే శ్యానిటైజర్లు, సబ్బులు, ప్రత్యేకంగా తయారు చేశామని డాక్టర్ మాలిక్ తాహ ఆయుర్వేదిక్  హాస్పిటల్ ఎం.డి అన్నారు.


✍మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రాణానికి తెగించి కరోనా వార్తలు ఇస్తున్నారని ప్రభుత్వం  గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు జర్నలిస్టులను వెంటనే ఆదుకోవాలని, జర్నలిస్టులకు హెల్త్ ఇన్సూరెన్స్ ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వార్డు వాలంటీర్ల మాదిరిగా జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు🙏


👉ఈ కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ కార్యదర్శి కె.విజయరాజు, ఆర్గనైజింగ్ సెక్రెటరీ డి.శివప్రసాద్, భాస్కర్ రెడ్డి, ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు మారుతీ, ఆనంద్ కుమార్ (SKU), డ్యానీయల్, హరికృష్ణ, సొసైటీ సభ్యులు సతీష్, దిలీప్, కుల్లాయిస్వామి, మీడియా ఎంప్లాయిస్ నాయకులు ఆదినారాయణ, కృష్ణమూర్తి, ఆంధ్రజ్యోతి రామారావు, కృష్ణ, కెమెరామెన్లు శ్రీనివాస్, సుధాకర్,రాజశేఖర్,బాలు, షాకిర్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


💎DIST.. JOURNALIST DEVELOPMENT SOCIETY, ANANTAPURAMU💎


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
క్రియేటివ్ సోల్ నేతృత్వంలో సెప్టెంబరు 28న ఎస్ఎస్ కన్వేన్షన్ సెంటర్లో
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
Dr.కోట సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ
Image
నిబంధనలు దిక్కరిస్తే పోలీసులు తమ చర్యలు విషయంలో వెనకడుగు వేయవద్దు..