సున్నా వడ్డీ  పేరుతో వైసీపీ డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది : వంగలపూడి అనిత

23.04.2020
ర్రాాా
సున్నా వడ్డీ  పేరుతో వైసీపీ డ్వాక్రా మహిళలను మోసం చేస్తోంది 
వైసీపీ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుంది
                                                                          -వంగలపూడి అనిత
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మహిళల ఉసురు తప్పకుండా తగులుతుంది. వైసీపీ ప్రభుత్వ తీరు చూస్తే మాటలు కోటలు దాటుతున్నాయ్, చేతలు ఇంటి గుమ్మం కూడా దాటట్లేదు. నవరత్రాలు పేరుతో మోసం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయ్యింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్టుండి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి మహిళలు గుర్తొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా మహిళల రూ. 2,500  కోట్ల రూపాయలు రుణాలకు సంబంధించిన వడ్డీని రీయింబర్స్ మెంట్ చేయాల్సి ఉంది.  గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందనడం సరికాదు. డ్వాక్రా గ్రూపులకు సంబంధించి ఇది నిరంతర ప్రక్రియ. ఏ ప్రభుత్వానికైనా గత ప్రభుత్వ డ్వాక్రా బకాయులు ఉంటాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయడంతో పాటు ఐదేళ్లలో ఒక్కో మహిళకు రూ. 75 వేలు ఇస్తామని జగన్ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. డ్వాక్రా మహిళలను ఆదుకుంటామని  పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి రకరకాల విన్యాసాలు చేశారు. మహిళల నుదిటిపై ముద్దులు పెట్టి ప్రగల్భాలు పలికారు. సినిమా చూపించారు మహిళలకు. డ్వాక్రాలో ఒక మహిళ ఉండటమంటే ఆర్థిక భరోసా. కుటుంబానికి ఆసరా. మాయమాటలతో వారితో ఓట్లేంచుకుని కనీసం మొదటి విడత రుణమాఫీ గురించి కూడా నేటికీ మాట్లాడకపోవడం ఎంతవరకు న్యాయం? 45 సంవత్సరాలు దాటిన మహిళకు పెన్షన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైంది?  టీడీపీ హయాంలో ఐదు లక్షల వరకు రుణం తీసుకున్న వారికి సున్నా వడ్డీ ఇచ్చాం. ఆ వడ్డీని ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించింది. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఏడు లక్షల యాభైవేలు కటాఫ్ పెడతానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి కేవలం మూడు లక్షల వరకు రుణం తీసుకున్నవారికి మాత్రమే వడ్డీ చెల్లిస్తామంటున్నారు. వైసీపీ మోసాన్ని మహిళలు అర్ధం చేసుకోవాలి.  లాక్ డౌన్ సమయంలో కూలి పనులకు వెళ్లలేక మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాయిదాలేమీ చెల్లింకర్లేదన్నారు. కానీ వడ్డీలన్నీ మీరే చెల్లించాలని బ్యాంకర్లు చెబుతున్నారు. దయచేసి డ్వాక్రా మహిళలకు ఆ మూడు నెలల వడ్డీ కూడా రాయితీ ఇవ్వాలి. ఆర్వోలకు సంవత్సరం నుంచి జీతాలు లేవు. విఏవోలకు జీతాలు లేవు. పది వేల రూపాయల జీతాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓటేంచుకున్నారు. ఇదేనా మాట తప్పడు మడమ తిప్పడు అంటే ? దళిత మహిళలను కూడా ఆదుకోవాలి. కనీసం మొదటి విడత డబ్బులైనా ఇవ్వండి. పనికి రాని స్కీములు పెట్టి ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోంది. ఇంత జరుగుతుంటే ఈ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? మహిళలకు అన్యాయం జరుగుతుంటే మీ నోర్లేమైనాయి? కరోనాతో జనం బిక్కుబిక్కుమంటుంటే ఎమ్మెల్యే రోజా పూలు చల్లించుకోవడం ఏంటి? అసలావిడకు ఆ ఆలోచన ఎలా వచ్చిందో? పైగా పూలు చల్లించుకోవడమేంటని ప్రశ్నించిన వారిని రోజా ఇష్టమొచ్చినట్టు తిట్టడమేంటి? ఇదో పనికిమాలిన ప్రభుత్వం. మహిళలను మోసం చేసిన వారు ఎవరూబతికి బట్టకట్టలేదు. 
-SD
వంగలపూడి అనిత
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు