సింహాచలం ఇంచార్జి ప్రధాన అర్చకుని సస్పెండ్ చేసిన ఈవో వెంకటేశ్వరరావు

సింహాచలం ఇంచార్జి ప్రధాన అర్చకుని సస్పెండ్ చేసిన ఈవో వెంకటేశ్వరరావు


విశాఖపట్నం ఏప్రిల్ 28(అంతిమ తీర్పు) :సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవం కార్యక్రమంలో  ప్రైవేటు వ్యక్తి తిరుపతి శ్రీను ఆలయంలోకి ప్రవేశించాడు  అన్న విషయం వివిధ పత్రికల్లో ను సోషల్ మీడియాలో హల్చల్ చేసిన నేపథ్యంలో ఈ సంఘటనపై ఈవో వెంకటేశ్వరరావు దర్యాప్తు చేసి తిరుపతి శ్రీను అనే ప్రైవేటు వ్యక్తి దేవస్థానానికి పాలు తీసుకు రావడానికి కొండ పైకి వచ్చాడని అయితే అతనికి దేవాలయంలో అనుమతించలేదని ఈవో స్పష్టం చేశారు అయితే తిరుపతి శ్రీనుకు సహకరించారని అనుమానంతో ఆలయ ఇంచార్జి ప్రధాన అర్చకులు గొడవర్తి కృష్ణమాచార్యులు సస్పెండ్ చేస్తూ ఈవో వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం  ఉత్తర్వులు జారీ చేశారు దీనిపై ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు