ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదు :మంత్రి అనీల్ కుమార్ యాదవ్

అమరావతి, ఏప్రిల్ 16.(అంతిమ తీర్పు) : రాష్ర్టజలవనరుల శాఖమంత్రి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పాయింట్స్.
కోవిడ్ -19 తో రాష్ర్టం అట్టుడుకి పోతుంటే
రాష్ర్టానికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు రాష్ర్టంలో మొట్టమొదటి కేసు వచ్చిందగ్గర్నుంచి ప్రతి రోజూ రివ్యూచేస్తూ ఎక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలి.ఏ విధంగా పేదలు,రైతులు
ఇబ్బంది పడకూడదని చెప్పి వారి బాగోగులు చూస్తూ కరోనాను ఎలా కట్టడి చేయాలా అని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఇక్కడ మంత్రుల సబ్ కమిటి,జిల్లాలోమంత్రులు,నియోజకవర్గస్దాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకు పోలీసు,శానిటరీ,రెవిన్యూ,వైద్యఆరోగ్యసిబ్బంది అంతా డే అండ్ నైట్ కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు.ఒక జాతీయన్యూస్ ఛానల్ భారతదేశంలోనే  మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ఇన్ లాక్ డౌన్ అని తీసుకుంటే  అది ఆంధ్రప్రదేశ్ గా పేర్కొంది.



లాక్డౌన్ లో కేసులు తగ్గించడంలోగాని,జాగ్రత్తలు తీసుకోవడంలోగాని మొట్టమొదటిస్ధానం ఏపికి వచ్చిందంటే ఈ రాష్ర్ట ముఖ్యమంత్రిగారి ముందుచూపే కారణం.


వాస్తవానికి చంద్రబాబునాయుడులాగా రోజూ వచ్చి అబద్ధాలు చెప్పడం హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం,దానిని ఒక ఈవెంట్ గా చేసుకునే
మనస్తత్వం జగన్ గారికి లెేదు.తనపని తాను చేసుకుంటూ పనిమాట్లాడాలి...పబ్లిసిటి కాదు అనే విధంగా మా ముఖ్యమంత్రిగారు ముందుకు వెళ్తుంటారు.అదే విధంగా పనులు జరుగుతున్నాయి.



రాష్ర్టం అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంధా వీడటం లేదు.ఆయన ఈ రాష్ర్టంలో లేడు, పక్క
రాష్ర్టంలో ఉన్నాడు.ముసలివాళ్లు,చిన్నపిల్లలకు
జాగ్రత్తలు తీసుకోమంటున్నాం ,చంద్రబాబునాయుడు
వయస్సుపైబడింది కాబట్టి ఆయనను తిరగమని కాని, లేకపోతే ప్రజలకు దగ్గర ఉండాలని ఎవరూ కోరుకోరు.ప్రభుత్వం కూడా ఆయనను హౌస్ ఐసోలేషన్ లో జాగ్రత్తగా ఉండమని చెబుతోంది.


పక్కరాష్ర్టంలో కూర్చుని వాళ్ల చెంచాలతో అబద్దపు ప్రచారం,వెధవప్రచారం,తప్పుడు ప్రచారాలు,చిల్లరరాజకీయాలు  చేస్తున్నారు.కరోనా సమయంలో కూడా టిడిపి నేతలు
రాజకీయం చేస్తున్నారు.కనీసం చంద్రబాబు కూడా సహాయం చేయడం లేదు.టిడిపి నేతలు రాష్ర్టంలో ఎక్కడైనా ప్రజలకు సహాయం చేస్తున్నారా.అది కూడా లేదు.


ఈరోజు ఆయన రాలేదు.ఆయన కుమారుడుది వయస్సు చిన్నదేగా.ఆయనైనా కనీసం ఈ రాష్ర్టంలో ఉన్నాడా అంటే ఆయన ఎలా ఎక్కడకు పోయాడో కూడా తెలియదు.కాని తప్పుడు రాజకీయాలు చేస్తూ శునకానందం పొందుతున్నారు.


హైకోర్టు ఇంగ్లీషు మీడియంపై ఆదేశాలు ఇస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైనట్లు వీళ్లేదో విజయం సాధించినట్లు ఈయన,రెండు
మీడియా ఛానల్స్ నానా హడావుడి చేస్తున్నారు.నేను సూటిగా అడుగుతున్నాను.మా విధానం ప్రతి ఒక్కరికి మంచివిద్య అందించాలి.బడగుబలహీనవర్గాలు,మైనారిటీల పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో
ఉన్నతస్దానాలకు ఎదిగేవిదంగా చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యం.


ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీరికి తెలుగంటే ఇష్టం లేదు.అని మాట్లాడుతున్నారు.తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతున్నాను,ఇంగ్లీషు మీడియం మీ బిడ్డలకేనా....పేదవర్గాలైన ఎస్సిఎస్టిబిసి మైనారిటీల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకుని ఉన్నతస్ధాయికి పోగూడదా....



మీ బిడ్డలను ఎక్కడ చదివిస్తున్నారు.తెలుగుమీడియంపై అంతప్రేమ ఒలకబోస్తున్న మీరు గాని,మీ పత్రికాధినేతలు గాని వారిని సూటిగా అడుగుతున్నాను.అసెంబ్లీలో చంద్రబాబు కుమారుడు లోకేష్ చెబుతుంటారు.నేను అమెరికాలో స్టాన్ ఫోర్డ్ లో చదివాను చెబుతుంటాడు.


మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదవాలి, పేదవాడి బిడ్డలు మాత్రం తెలుగుమీడియంలో చదివి ఇక్కడే మగ్గిపోయి ఉండాలా...మీకు ఒక న్యాయం...పేదవాడికి ఒక న్యాయమా...


తమ బిడ్డను తెలుగుమీడియంలో చేర్పించిన ఒక్క తెలుగుదేశం నాయకుడుని చూపించండి.ఒక్కఎంఎల్ ఏను,మాజీమంత్రులను చూపించండి.చంద్రబాబునాయుడును అడుగుతున్నాను...నీ మనవడు దేవాంశు ఎక్కడ చదువుతున్నాడు.తెలుగుపై అంత ప్రేమఒలకబోస్తున్నావే.దేవాంశును తెలుగుమీడియంలో చేర్చవచ్చు కదా.


మీ పిల్లలు మాత్రం మంచిగా చదువుకోవాలి,నాలుగైదు
భాషలు నేర్చుకోవాలి.పెద్ద పెద్ద స్దాయికి వెళ్లాలి.పేదవారి బిడ్డలు మాత్రం
అడ్డడుగున ఉండిపోవాలి.


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు 20 ఏళ్ల తర్వాత ప్రతిపేదవాడి బిడ్డ మంచిస్దాయిలో ఉండాలి.పోటీ ప్రపంచంలో పోటీపడేలా ఉండాలి
అని కోరుకుంటున్నారు,రాష్ర్టంలో 95 శాతం మంది
తల్లిదండ్రులు తమ బిడ్డలను ఇంగ్లీషు మీడియంలో చేర్పించాలనే ఏకభిప్రాయంతో ఉంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారు.


ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా....చంద్రబాబు ఆయన బినామిలు నారాయణ,చైతన్యసంస్ధలను బతికించుకునేదానికి ఈ
విద్యావ్యవస్ధలో ప్రైవేటీకరణ పెంచి గవర్నమెంట్ విద్యను నాశనం చేశారు.రాష్ర్టంలో పేదల బిడ్డల గురించి ఆరాటమనేదే లేదు.


ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదు.ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఒక మంచిస్ధాయిలో ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ముందుకు వెళ్తున్నారు.రాజీ ప్రశ్నేలేదు.



ప్రతి దానికి కోర్టుకు వెళ్లడం,సైంధవుడులా అడ్డుపడటం.కరోనా నేపధ్యంలో రాష్ర్టంలోఇంత జరుగుతుంటే మీరు ఎక్కడకు వెళ్లారు.చిల్లర
రాజకీయాలు చేయడంలో మాత్రం ముందుంటారు. 


ఎలక్షన్ కమీషనర్....దానికి సంబంధించి చూస్తే రమేష్ కుమార్ 
చేస్తున్నకార్యక్రమాలు మాకు ఇబ్బందిగా ఉన్నాయి.కేంద్రహోంశాఖకు లెటర్ ఎవరు రాశారు అని ప్రశ్నిస్తే ఎప్పుడూ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడలేదు.



కాని మా  పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ విజయసాయిరెడ్డిగారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం నేనే రాశాను లేఖ అని చెప్పారు.ఈరోజు సూటిగా మూడుప్రశ్నలు అడిగాం.ఇది టిడిపి ఎంపి కనకమేడల వద్ద నుంచి వచ్చిన లెటర్ అవునా...కాదా...ఆయన డ్రాఫ్ట్ చేసింది కాదా...ఏ ఐపి అడ్రస్ నుంచి వచ్చింది అని అడుగుతుంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు.పోలీసు నిగ్గుతేలుస్తుంది అంటే అది అవసరం లేదంటాడు.ఎందుకు అవసరం లేదు.


నిజంగా మీరే డ్రాఫ్ట్ చేసిఉంటే మీకు భయం ఎందుకు ...ఇది ఏ ఆఫీసునుంచి వచ్చింది...ఎవరు డ్రాఫ్ట్ చేశారు....ఏ ఐపి నుంచి వచ్చింది అని తెలిస్తే మీ బంఢారం అంతా బట్టబయలవుతుంది.కాబట్టి భయపడి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు.


ఇలాంటప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్ కమీషన్ పై ప్రభుత్వం ఏదైతే చర్య తీసుకుంటుందో అది తీసుకుంటుంది.మీరు ,తెలుగుదేశం
పార్టీ చెప్పినట్లు ఈ ప్రభుత్వం నడుచుకోవాలా అని అడుగుతున్నాం.


ప్రపంచం,దేశం,రాష్ర్టం అంతా కరోనా తో అల్లాడుతుంటే చంద్రబాబు బుర్రమాత్రం ఎల్లోవైరస్ తో నిండిపోయింది.వయస్సు అయిపోయింది.ఎటూ కుటుంబంతో పక్కరాష్ర్టంలో వెళ్లి దాక్కున్నావు.అక్కడే ప్రశాంతంగా ఉండు.


కాని నీ చెంచాలతో...తెలుగుదేశం పార్టీనేతలు ఎక్కడకు వెళ్లారో తెలియదు.ఆ పార్టీ నేతలు ఏ జిల్లాలో అయినా తిరిగారా...మాస్కులు లేవు.పిపిఏ కిట్స్ లేవని మాట్లాడుతున్నారు.ఎప్పుడైనా చూశారా.


ఈరోజు దేశంలోనే కరోనా నిర్ధారణకు హయ్యస్ట్ టెస్ట్ లు అంటే ప్రతిరోజు 2 వేల టెస్ట్ లు చేసే రాష్ర్టంలో ఏదైనా ఉందంటే అది ఏపి మాత్రమే.ఇంకా పెంచుతూపోతున్నాం.నాలుగువేల టెస్ట్ లు చేసే దిశగా
వెళ్తున్నాం.


అన్ని రకాలుగా ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ముందుకు తీసుకువెళ్తుంటే కనీసం పిల్లికి బిఛ్చం పెట్టి ఉండరు.టిడిపి వారు సహాయం చేయకుండా చౌకబారు విమర్శలు చేయడంలో మాత్రం ముందుంటారు.  


పదిరోజులకొకసారి రావడం.... తప్పుడు విమర్శలు చేయడం....ఇంట్లోపోయి పడుకోవడం ఇది వారు చేసేపని.ఇలాంటి పనులు చేస్తుంటే మొన్న ప్రజలు 23 స్ధానాలకు పరిమితం చేశారు.ఈసారి మూడు లేదా రెండింటికి పరిమితం చేస్తారు.


ప్రభుత్వం చేస్తున్న మంచికి సహకరించకపోయినా పర్వాలేదు.ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కష్టపడుతుంటే వారి కష్టాన్ని అవహేళనగా,చులకనగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని తెలియచేస్తున్నాం.


Popular posts
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image