ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట

30–04–2020
అమరావతి


ఎం.ఎస్‌.ఎం.ఈ.లకు వైయస్‌.జగన్‌ ప్రభుత్వం ఊరట


*కోవిడ్‌ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు ఆర్థికరక్షణ ప్రణాళిక


*2014–15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగులో ఉన్న బకాయిలు ఇవ్వాలని నిర్ణయం, మొత్తంగా రూ. 905 కోట్ల చెల్లింపులకు సీఎం నిర్ణయం*


*మే నెలలో సగం, జూన్‌ నెలలో సగం చెల్లించాలని నిర్ణయం*


*ఏప్రిల్, మే, జూన్‌.. ఈ మూడు నెలల కాలానికి ఎంస్‌ఎంఈలకు పవర్‌ డిమాండ్‌ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం*


*తక్కువ వడ్డీకి రూ.200 కోట్ల రూపాయలను వర్కింగ్‌కేపిటల్‌గా ఎంఎస్‌ఎంఈలకు అందించాలని నిర్ణయం*


*మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌)కరెంటు మినిమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపు వాయిదా* 


*కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వచ్చాక టెక్ట్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించి చర్యలు తీసుకుంటాన్న సీఎం*


అమరావతి: కోవిడ్‌–19 కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయాలు
ఎంఎస్‌ఎంఈలు సహా కీలక రంగాల్లోని పరిశ్రమలను ఆదుకునేందుకు చర్యలు 
క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి
సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ జేఎన్వీ. సుబ్రహ్మణ్యం సహా ఇతర అధికారులు హాజరు


ఎంఎస్‌ఎంఈలను కాపాడేందుకు పలు రకాల ప్రతిపాదనలను నివేదించిన అధికారులు
గత సమావేశంలో సీఎం ఇచ్చిన సూచనల మేరకు ప్రతిపాదనలు చేసిన అధికారులు. ఈ ప్రతిపాదనలపై తీవ్ర చర్చ జరిగిన తర్వాత సీఎం ఈ కింద నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. 


1. ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల బకాయిలు చెల్లింపు:


– 2014–15 నుంచి పెండింగులో ఉన్న ఎంఎస్‌ఈల ప్రోత్సాహకాల బకాయిలను పూర్తిగా చెల్లించాల నిర్ణయం. విలువ రూ. 905 కోట్లు
– మే నెలలో, జూన్‌ నెలలో చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం.
– 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 వరకూ గత ప్రభుత్దవం హాయంలో ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాల రూపంలో ఇవ్వాల్సిన మొత్తం రూ.828 కోట్లు చెల్లించలేదన్న విషయంపై సమావేశంలో చర్చ. 
– సంవత్సరాలవారీగా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాల రూపంలో బకాయిలు 
2014–15లో రూ.43 కోట్లు
2015–16లో  రూ. 70 కోట్లు
2016–17లో రూ. 195 కోట్లు
2017–18లో రూ. 207 కోట్లు
2018–19లో  రూ. 313 కోట్లు
అప్పటివరకూ మొత్తం రూ. 828 కోట్లు
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు ( అప్‌లోడ్‌ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు.
మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్‌ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటన. 


2, ఏప్రిల్, మే, జూన్‌నెలలకు ఎంఎస్‌ఎంఈల మినిమం కరెంటు డిమాండ్‌ ఛార్జీల రద్దు:


– దీంతోపాటు  ఏప్రిల్, మే, జూన్‌నెలల కాలానికి ఎంఎస్‌ఎంఈల మినిమం విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీలను రద్దుచేయాలని నిర్ణయం. దాదాపు రూ.188 కోట్లమేర అన్ని ఎంఎస్‌ఎంఈలకు లబ్ధి.


పై రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎంఎస్‌ఎంఈలకు మేలు. వీటిలో 9,68,269 మందికి ఉపాధి. 


3. ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈల తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకు గ్యారంటీ ఇస్తూ  సిడ్బీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్‌ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయం. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్‌ కేపిటల్‌ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.


4. టెక్స్‌టైల్‌ పరిశ్రమల సహా, భారీ, అతిభారీ పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్‌ నెలల) మినిమమం డిమాండ్‌ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయం. ఎలాంటి అపరాథరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ భారాన్ని  రాష్ట్ర ప్రభుత్వమే మోస్తుంది. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్‌క్యాపిటల్‌ సమకూరుతుంది. 


5. టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించేదిశగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం సమావేశంలో ప్రకటించారు. 


అంతేకాకుండా కోవిడ్‌–19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలను అదుకోవడానికి ఆలోచనలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు వెలువడినత తర్వాత మరోసారి సమీక్షచేసి టెక్స్‌టైల్‌ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకోవడానికి అన్నిచర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ  వైయస్‌.జగన్‌ సమావేశంలో స్పష్టంచేశారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image