వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి

వలస వాసులు కాలినడక ప్రయాణాలు చేయవద్దు :వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి


వింజమూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వలస వాసులు ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వారి వారి ప్రాంతాలకు చేరుకునేందుకు ఎట్టి పరిస్థితులలోనూ కాలినడకన ప్రయాణాలు చేయవద్దని వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. సూదూర ప్రాంతాల నుండి పొట్ట చేతపట్టుకుని కూలీ పనులకు వచ్చిన వారి సమాచారమును సేకరించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు శ్రీకారం చుట్టనున్నామన్నారు. గురువారం సాయంత్రం వింజమూరు మండలంలోని చంద్రపడియ గ్రామం నుండి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంకు కాలినడకన బయలుదేరిన 6 మందిని పోలీసులు గుర్తించి వారిని తహసిల్ధారు కార్యాలయం వద్దకు తరలించారు. వీళ్ళు గత 3 నెలల క్రితం చంద్రపడియ గ్రామంలో రామాలయం నిర్మాణానికి కూలీలుగా రావడం జరిగింది. ఉగాది నాటికి పనులు పూర్తయినా అప్పటికే కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఈ కూలీలు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న మొన్నటి వరకు చంద్రపడియ గ్రామంలోనే ఉంటున్న కూలీలు చివరికి గత్యంతరం లేని పరిస్థితులలో కాలినడకన పెద్దాపురంకు బయలుదేరారు. బుక్కాపురం రోడ్డు మార్గాన వెళుతున్న కూలీలను గుర్తించిన స్థానికులు ఎస్.ఐ బాజిరెడ్డికి సమాచారం అందించడంతో వెంటనే స్పందించిన ఆయన కాలినడకన వెళుతున్న కూలీలకు నచ్చజెప్పి వింజమూరు మండల కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఎస్.ఐ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ ఎండలలో కాలినడక అత్యంత ప్రమాదకరమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.


Popular posts
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image