విద్యా వ్యవస్థను దిగజార్చిన జగన్‌ : తెలుగుదేశం నేత కళా వెంకట్రావు

తేది : 28.04.2020
త్ప్ర
విద్యా వ్యవస్థను దిగజార్చిన జగన్‌ : కళా వెంకట్రావు
1. అమ్మ ఒడి + వసతి దీవెన + విద్యాదీవెన పథకాల ద్వారా ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి లక్షా 50 వేల రూపాయలు ఇస్తానని జగన్‌ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
2. అమ్మ ఒడి రూ.15,000 + ఫీజు రీయంబర్స్‌మెంట్‌ రూ.35,000 + వసతి దీవెన రూ.20,000... ఈ మూడు కలిపితే రూ.70 వేలు మాత్రమే. లక్షా 50 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి రూ.70 వేలకు కోత కోయడం మోసం చేయడం కాదా? మడమ తిప్పడం కాదా? ఈ మోసాన్ని కప్పిపెట్టుకొనేందుకు జాతీయ మీడియాలో పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్లతో ప్రజాధనం దుర్వినియోగం... పైగా గత ప్రభుత్వంపై నిందలు.
3. 5 ఏళ్లలో ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు వైయస్‌ ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఖర్చు పెట్టింది. మరో రూ.2,400 కోట్లు బకాయి పెట్టింది. ఈ బకాయిని రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చెల్లించింది వాస్తవం కాదా?
4. చంద్రబాబు ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క ఫీజు రీయంబర్స్‌మెంట్‌కే రూ.16 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ ఫీజు రీయంబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.2,400 కోట్లు చెల్లించారు.
5. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం రూ.45 వేలు ఇస్తే, దాన్ని జగన్‌ రూ.35 వేలకు తగ్గించింది వాస్తవం కాదా? దీనితో విద్యార్థిల్ని, విద్యా సంస్థల్ని సంక్షోభంలోకి నెట్టినట్లు కాదా?
6. అమ్మ ఒడి 60 లక్షల మంది అర్హులుంటే 43 లక్షల మందికే కుదించింది జగన్‌ ప్రభుత్వం కాదా!
7. విద్యా సంస్థలకు వైకాపా పార్టీ రంగు కొట్టి, ఉపాధ్యాయుకు, లెక్చరర్లకు జీతాల్లో 50% కోతకోసి, ఎన్నికల కోసం పరీక్షలు వాయిదా వేసి విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారు.
8. చంద్రబాబు రెండు డీయస్సీలు జరిపి 17 వేల ఉపాధ్యాయ నియామకాలు చేశారు. ప్రొఫెసర్లు, లెక్చరర్లు వగైరా టీచింగ్‌ పోస్టులు 2,500 భర్తీ చేశారు. 3,640 డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, 1,217 వర్చువల్‌ క్లాస్‌రూమ్‌లు, జూనియర్‌ కాలేజీలకు 100% వైఫై, విద్యార్థినులకు 5.61 లక్షల సైకిళ్లు ఇచ్చారు. మున్సిపల్‌ పాఠశాలల్లో తెలుగుతోపాటు చంద్రన్న ప్రభుత్వం ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టింది.
9. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులకు విదేశీ విద్యకు రూ.10 లక్షలు ఇచ్చారు.
10. చంద్రబాబు 5 ఏళ్లలో విద్యా రంగానికి 1 లక్షా 10 వేల కోట్ల బడ్జెట్‌ ఇచ్చారు. వైఎస్‌ విద్యకు బడ్జెట్‌లో 5% ఖర్చు చేయగా, చంద్రన్న దాన్ని 10%కు పెంచారు.
11. యూనివర్సిటీ పాలకమండళ్ల నియామకంలో జగన్‌ సామాజిక న్యాయాన్ని మంటగలిపారు.


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image