మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ

*పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ*


*రైతులు నష్ట పోకుండా గిట్టుబాటు ధర అందించి మొక్కజొన్న కొనుగోళ్లు*


*పెనుకొండ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 500 పైగా మొక్కజొన్న కోనుగోలు చేసాం*


*ఉధ్యాన వన రైతులను, పండ్ల తోట రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది*


*పరిశ్రమలకు జివో 151 నుండి మినహాయింపులు ఇచ్చి, పెనుకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో వున్నారు*


*పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు*


*మంత్రి శంకరనారాయణ*


అనంతపురం, పెనుకొండ:- 27.04.2020


కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ ప్రభావం రైతాంగానికి భారం కాకూడదని, రైతులు నష్ట పోకూడదు అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలన్ని మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు లాక్ డౌన్ నేపథ్యంలో పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడి నష్ట పోకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు సమీక్షలు జరిపి కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు రైతులను ఆదుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటున్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగా మొక్కజొన్న రైతులను ఆదుకునే దిశగా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా రైతుల వద్ద పంటను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 1760 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో దాదాపు 500 క్వింటాలకు పైగా మొక్కజొన్న పంటను సేకరించడం జరిగిందని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ ప్రభావం వలన సరైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం పతనమౌతున్న ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఉధ్యాన వన రైతులు పండించిన చీని, బొప్పాయ, ద్రాక్ష, అరటి, మామిడి, దోస కాయ, దాన్నిమ్మ, వాటర్ మెలన్ వంటి పండ్ల తోటల రైతులు నష్టపోకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రవాణా సదుపాయాలు కల్పించడం, జిల్లాలో కూడా రైతుల వద్ద నుండి పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాలో మొక్కజొన్న, బెంగాల్ గ్రామ్, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కనేకల్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 


*రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో వున్నారని, ఆ దిశగా పెనుకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ వీరా వాహన సంస్థను ఏర్పాటు చేసేందుకు అలాగే ఏరో స్పేస్ డిఫెన్స్ ఎకాడమి ఏర్పాటు చేసేందుకు అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం, గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. గతంలో ఈ ఫ్యాక్టరీలు రావడానికి అడ్డంకిగా వున్న జివో 151 నుండి పరిశ్రమలకు  ఏపి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్యండంతో పైన పేర్కొన్న పరిశ్రమల ఏర్పాటుకు లైన్ క్లియరైనట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన 151 జివో ప్రకారం కాలుష్య నివారణకు పరిశ్రమల ఏర్పాటును నిషేధం విధించిందని, ఐతే కియా పరిశ్రమనుండి వీరా వాహన మరియు ఏరో స్పేస్ డిఫెన్స్ సంస్థలు ఒకదానికొకటి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం, అంతేకాకుండా ఈ పరిశ్రమలనుండి పర్యావరణానికి ముప్పు లేదని నిర్థారణ అయిన తర్వాతే గౌ. జగన్మోహన్ రెడ్డి గారు జివో 151 నుండి ఈ పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్యడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన అనంతపురం జిల్లా, ముఖ్యంగా పెనుకొండ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కొరకు 
తన పూర్తి సహాయ సహకారాలను, తోడ్పాటును అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 



ఈ కార్యక్రమంలో ఏవో రాకేష్ నాయక్, ఎంపిడిఓ శివశంకరప్ప, ఎమ్మార్వో నాగరాజు, సిఐ శ్రీహరి, ఎస్సై హరూన్ బాషా మండల వైసీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి పట్టణ కన్వీనర్ వెంకటరత్నం, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, శంకర రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, మునిమడుగు శ్రీనివాసులు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు. 


 


Popular posts
దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
*వింజమూరులో తాగునీటి పధకాల పరిశీలన* వింజమూరు, సెప్టెంబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు గ్రామ పంచాయితీ పరిధిలో తాగునీటి పధకాల పనితీరును పర్యవేక్షించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరాల శాఖ, పంచాయితీ అధికారులు శ్రీకారం చుట్టారు. మండల కేంద్రమైన వింజమూరుతో పాటు అంతర్భాగాలైన సాతానివారిపాళెం, లెక్కలవారిపాళెం, మోటచింతలపాళెం, బొమ్మరాజుచెరువు, జి.బి.కే.ఆర్. ఎస్టీ కాలనీ తదితర ప్రాంతాలలోని స్కీములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్.డబ్య్లు.ఎస్ డి.ఇ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో అడపా దడపా వర్షాలు కురుస్తున్నందున క్షేత్ర స్థాయిలో నీటి నిల్వలను అంచనాలు వేస్తున్నామన్నారు. భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు అవసరమైన నీటి వివరాలను నమోదు చేస్తున్నామన్నారు. అంతేగాక మరమ్మత్తులకు గురైన పంపింగ్ స్కీంలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంచాయితీ పరిధిలో 110 తాగునీటి స్కీంలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 28,660 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 35 వేలు పై చిలుకే ఉంటుందన్నారు. ప్రజలందరికీ కూడా సమృద్ధిగా నీటిని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో పంచాయుతీ కార్యదర్శి, మండల ఇంచార్జ్ ఇ.ఓ.పి.ఆర్.డి బి.శ్రీనివాసులురెడ్డి, ఆర్.డబ్య్లు.ఎస్ ఏ.ఇ మసూస్ అహ్మద్, సచివాలయ ఉద్యోగులు నరేంద్ర, నాగిరెడ్డి, సునీల్, నారయణ, వారి సిబ్బంది పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image