మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ

*పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి శంకరనారాయణ*


*రైతులు నష్ట పోకుండా గిట్టుబాటు ధర అందించి మొక్కజొన్న కొనుగోళ్లు*


*పెనుకొండ పరిసర ప్రాంతాల నుండి దాదాపు 500 పైగా మొక్కజొన్న కోనుగోలు చేసాం*


*ఉధ్యాన వన రైతులను, పండ్ల తోట రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది*


*పరిశ్రమలకు జివో 151 నుండి మినహాయింపులు ఇచ్చి, పెనుకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో వున్నారు*


*పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి గారికి ప్రజల తరఫున ధన్యవాదాలు*


*మంత్రి శంకరనారాయణ*


అనంతపురం, పెనుకొండ:- 27.04.2020


కరోనా వ్యాప్తి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ ప్రభావం రైతాంగానికి భారం కాకూడదని, రైతులు నష్ట పోకూడదు అనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ మాలగూండ్ల శంకరనారాయణ పేర్కొన్నారు. సోమవారం ఉదయం పెనుకొండ పట్టణంలోని మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలన్ని మంత్రి శంకరనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ రైతు లాక్ డౌన్ నేపథ్యంలో పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడి నష్ట పోకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు సమీక్షలు జరిపి కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలతో పాటు రైతులను ఆదుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుటున్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగా మొక్కజొన్న రైతులను ఆదుకునే దిశగా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా నేరుగా రైతుల వద్ద పంటను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 1760 చెల్లించి కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  పెనుకొండ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కేంద్రంలో దాదాపు 500 క్వింటాలకు పైగా మొక్కజొన్న పంటను సేకరించడం జరిగిందని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ ప్రభావం వలన సరైన మార్కెట్ సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు లేకపోవడం పతనమౌతున్న ధరల నియంత్రణ చర్యల్లో భాగంగా గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో సమీక్షలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రైతులను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలోని ఉధ్యాన వన రైతులు పండించిన చీని, బొప్పాయ, ద్రాక్ష, అరటి, మామిడి, దోస కాయ, దాన్నిమ్మ, వాటర్ మెలన్ వంటి పండ్ల తోటల రైతులు నష్టపోకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు రవాణా సదుపాయాలు కల్పించడం, జిల్లాలో కూడా రైతుల వద్ద నుండి పంటను కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అనంతపురం జిల్లాలో మొక్కజొన్న, బెంగాల్ గ్రామ్, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కనేకల్ ప్రాంతంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 


*రానున్న రోజుల్లో పెనుకొండ నియోజకవర్గాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో వున్నారని, ఆ దిశగా పెనుకొండ ప్రాంతంలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ వీరా వాహన సంస్థను ఏర్పాటు చేసేందుకు అలాగే ఏరో స్పేస్ డిఫెన్స్ ఎకాడమి ఏర్పాటు చేసేందుకు అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం, గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జారీ చేశారని మంత్రి శంకరనారాయణ తెలిపారు. గతంలో ఈ ఫ్యాక్టరీలు రావడానికి అడ్డంకిగా వున్న జివో 151 నుండి పరిశ్రమలకు  ఏపి ప్రభుత్వం మినహాయింపులు ఇవ్యండంతో పైన పేర్కొన్న పరిశ్రమల ఏర్పాటుకు లైన్ క్లియరైనట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన 151 జివో ప్రకారం కాలుష్య నివారణకు పరిశ్రమల ఏర్పాటును నిషేధం విధించిందని, ఐతే కియా పరిశ్రమనుండి వీరా వాహన మరియు ఏరో స్పేస్ డిఫెన్స్ సంస్థలు ఒకదానికొకటి 25 కిలోమీటర్ల దూరంలో ఉండటం, అంతేకాకుండా ఈ పరిశ్రమలనుండి పర్యావరణానికి ముప్పు లేదని నిర్థారణ అయిన తర్వాతే గౌ. జగన్మోహన్ రెడ్డి గారు జివో 151 నుండి ఈ పరిశ్రమలకు మినహాయింపులు ఇవ్యడం జరిగిందని తెలిపారు. వెనుకబడిన అనంతపురం జిల్లా, ముఖ్యంగా పెనుకొండ నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి కొరకు 
తన పూర్తి సహాయ సహకారాలను, తోడ్పాటును అందిస్తున్న గౌ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. 



ఈ కార్యక్రమంలో ఏవో రాకేష్ నాయక్, ఎంపిడిఓ శివశంకరప్ప, ఎమ్మార్వో నాగరాజు, సిఐ శ్రీహరి, ఎస్సై హరూన్ బాషా మండల వైసీపీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, సోమందేపల్లి పట్టణ కన్వీనర్ వెంకటరత్నం, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, పట్టణ కన్వీనర్ తయూబ్, శంకర రెడ్డి, గుట్టూరు శ్రీరాములు, నాగలూరు బాబు, మునిమడుగు శ్రీనివాసులు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు. 


 


Popular posts
శ్రామిక జాతికి  మే డే దినోత్సవం సందర్భంగా శ్రీ లక్ష్మి చారిటబుల్.ట్రస్ట్, మే డే.శుభాకాంక్షలు
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image