ప్రపంచ మేధావి అని పొగిడి అదే నోటితో నేడు అసభ్య పదజాలంతో దూషణలా :చేజర్ల

*⚡రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుకే ద్రోహం చేసిన వ్యక్తి ప్రసన్న*
*⚡ప్రసన్న వెన్నుపోటు చరిత్ర తెలుసుకనుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇతని కంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి ఇతనికి ఇవ్వలేదు*
 *⚡నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి  చేత కరోనా పై లైవ్ ప్రెస్సుమీట్ పెట్టించు
*⚡అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
                            - *చేజర్ల*
    *తనకు రాజకీయ బిక్షపెట్టిన చంద్రబాబు నాయుడు కే ద్రోహం చేసిన చరిత్ర కలిగిన వ్యకి ప్రసన్నకుమార్ రెడ్డి ని ఆయన చరిత్ర తెలుసుకనుకనే శ్రీ జగన్మోహన్ రెడ్డి  జిల్లాలో ఇతనికంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చి ఇతనిని పక్కన పెట్టారని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఈరోజు కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరినుంది ఎలా బయటపడాలని అందరూ ఆలోచిస్తుంటే కోవూరు శాసనసభ్యుడు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాత్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని,ఇదే ప్రసన్నకుమార్ రెడ్డి గతములో  చంద్రబాబు నాయుడి గారిని ప్రపంచ మేధావి అని పొగిడారని అదే నోటితో నేడు అసభ్య పదజాలంతో విమర్శలు చేస్తున్నారని,గతములో స్వర్గీయ వై యెస్ రాజశేఖరరెడ్డి  గారిని,జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని,తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎంత కయినా దిగజారే వ్యకి అని,2009 లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలిచి నెల తిరగకుండానే పార్టీ మారిన వ్యక్తి ప్రసన్న అని ఇటువంటి వారు కూడా చంద్రబాబు ను తిట్టడము విడ్డురాంగా ఉందని,లాక్ డౌన్ నిబంధనలు కు కట్టుబడి హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు గారి పై విమర్శలు చేస్తున్నారని,గతములో వై యెస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు గా ఉన్న 5 సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉన్నారని,నాడు రాష్ట్రంలో పెద్ద పెద్ద తుపానులు వచ్చిన రాష్ట్రంలో తొంగికుడా చడలేదని అటువంటి వారి నేడు చంద్రబాబు హైదరాబాద్ లో ఉన్నారని విమర్శలు చేస్తున్నారని,మీ ముఖ్యమంత్రి కి కరోనాను అరికట్టడము చేతకాదని చెప్పండి చంద్రబాబు గారు వచ్చి చేసి చూపిస్తారని,శ్రీ ప్రసన్నకుమార్ రెడ్డి గారికి దమ్ముంటే మీ ముఖ్యమంత్రి చేత కరోనా వైరస్ గురించి ఒక లైవ్ ప్రెస్సుమీట్ పెట్టించి తరువాత చంద్రబాబు గురించి మాట్లాడాలని అదేవిధంగా తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు.*


*అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి*
#################


*నిన్న కురిసిన అకాల వర్షాల వలన జిల్లాలో రైతులు త్రీవరం గా నష్టపోయారని ముఖ్యంగా పండ్ల తోటల రైతులు ఎక్కువుగా నష్టపోయారని కావున నిన్న కురిచిన అకాల వర్షాలు వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము*