చంద్రబాబు హోమ్ క్వారంటయిన్  లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు


09 - 04 - 2020
విజయవాడ


కనపడని శత్రువుతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది.
చంద్రబాబు హోమ్ క్వారంటయిన్  లో ఉండి ఉత్తరాలు రాస్తున్నారు.
మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు.


వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని,  ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు అని మంత్రులు కన్నబాబు, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.


గురువారం కెబీఎన్ కళాశాల వద్ద జరిగిన పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమం లో మంత్రి కన్నబాబు అతిధి గా పాల్గొన్నారు...


ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పేదలకు సాయం చేయాలని నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం అన్నారు.


ప్రభుత్వంపై బురద చల్లాలని చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.


కరోన వైరస్ ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు.


బీజేపీ, సీపీఐ, జనసేన,పార్టీలు చంద్రబాబు తోక పార్టీల మాదిరిగా  వ్యవహరిస్తున్నాయి.


అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ...
కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవడానికి మంత్రులు ముందుకు వస్తున్నారు.


ఒక్కో నియోజకవర్గంలో 40 వేల మందికి నిత్యవసర సరుకులు కూరగాయలు పంపిణీ చేస్తున్నాం.


సోషల్ డిస్టన్స్ ద్వారా  ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నాం.


కరోన పోరులో ప్రజలకు వైద్యంతో నిత్యావసర వస్తువుల పంపిణీ కూడా చాలా అవసరం.


చంద్రబాబు ఇంకా భ్రమలో ఉన్నారా లేకా నైజం అలా ఉందొ అర్థం కావడం లేదు.


వ్యవస్థలను విధ్వంసం చెయ్యాల్సిన అవసరం ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదు.


ఆర్ధిక వ్యవస్థను విధ్వంసం చేసి చంద్రబాబు నీతులు చెప్తున్నారు.


విపత్కర పరిస్థితిలో మీ పాలన ఎలా ఉందో ఉత్తరాంధ్ర ప్రజలు చెప్తున్నారు.


టీడీపీ అధికారంలో ఉండగా టమాటకు గిట్టుబాటు ధరలు కల్పించారా అని ప్రశ్నించారు.


నష్టం వచ్చిన మొక్కజొన్న, జొన్న, రబి, టమాటా, అరటి కొనుగోలు చెస్తున్నాం.


కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రానికి న్యాయం చెయ్యమని చంద్రబాబు ఎందుకు లేఖ రాయడం లేదు.


పోస్టు కార్డుల ఉద్యమంలాగా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు.


విపత్తులు వస్తే రాజకీయ రాబంధులాగా ఆనంద పడుతున్నారు.


Popular posts
Trs ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image