ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ బిర్యాని పంపిణీ

ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో విజిటేబుల్ బిర్యాని పంపిణీ
విజయవాడ పశ్చిమ, ఏప్రిల్, 26 : (అంతిమ తీర్పు);          ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోన కోవిడ్ 19 మహమ్మారిని ఎదుర్కునేందుకు పోలీసు, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందితో పాటు మీడియా కృషి కూడా అభినందనీయమని ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు బ్రహ్మయ్య అన్నారు. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి, లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి నిరాశ్రయులైన వారికి, వలస కూలీలకు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం విజయవాడ కమిటీ తరఫున వెజిటేబుల్ బిర్యాని ప్యాకెట్లను ఆదివారం స్థానిక భవానిపురం పోలీస్ స్టేషన్లో పోలీసు ఉన్నతాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అన్నవరపు బ్రమ్మయ్య మాట్లాడుతూ మిగతా దేశాలతో పోలిస్తే ఎక్కువ జనాభా కలిగిన భారతదేశం ముందుగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మరణాల శాతం తక్కువగా ఉందన్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ఏపీజేఎఫ్  నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకటరమణ మాట్లాడుతూ కరోనా కోవిడ్ 19  మహమ్మారి వ్యాప్తి, దేశంలో నెలకొన్న పరిస్థితులు ప్రభావంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారనీ తినడానికి తిండి దొరక్క అల్లాడుతున్నారని  అటువంటి వారికి జర్నలిస్టుగా సామాజిక బాధ్యతతో ఆహార పొట్లాలను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం విజయవాడ కమిటీ తరఫున పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఇంటిని, కుటుంభం  సభ్యులను  వదిలి రేయింబవళ్ళు విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో భవాని పురం పోలీస్ స్టేషన్ ఎస్ఐ లు, రవీంద్ర బాబు, మూర్తి ,ఇస్రాయిల్ ,పోలీస్ సిబ్బంది, జర్నలిస్టు ఫోరం నాయకులు, తదితరులు పాల్గొన్నారు


Popular posts
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి.. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు రాజధాని గ్రామమైన పెనుమాక సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ప్లే కార్డులతో భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలిపారు, ఈ కార్యక్రమంలో రవి పాల్గొని మాట్లాడుతూ ఒక ప్రక్క కరోనా భయంతో లాక్ డౌన్ అమలు జరుగుతుండగా మరోపక్క బిజెపి ప్రభుత్వం దొడ్డిదారిన గత మూడు వారాల నుండి ప్రతిరోజు అడ్డగోలుగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచటం దుర్మార్గమని అన్నారు, పెట్రోల్ పై లీటరుకు పది రూపాయలు డీజిల్ పై లీటర్కు 11 రూపాయల చొప్పున పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని రవి విమర్శించారు పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని రవి డిమాండ్ చేశారు, ఎక్సైజ్ వ్యాట్ పేరుతో పెట్రోల్పై 32 రూపాయలు 98 పైసలు డీజిల్పై 31 రూపాయలు 83 పైసలు ను ప్రభుత్వా లు దండు కుంటున్నాయి అని అవి చాలవన్నట్లు గా లాభార్జన ధ్యేయం గా ప్రభుత్వాలు వ్యవహరించడం దుర్మార్గమని రవి అన్నారు. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గుతుండగా భారతదేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా పెంచుతున్నారని రవి ప్రశ్నించారు తక్షణం పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు ఎస్కే ఎర్ర పీరు ఎస్కే ఖుద్దూస్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు....
Image
విశాఖ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు*  పిడుగుపాటు హెచ్చరిక
సరస్వతీదేవి అలంకారం లో దుర్గమ్మ కన్నుల పండువగా ఉన్నారు:రోజా
కల్యాణమండపం ప్రారంభోత్సావం
Image