పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ...


.. వింజమూరు పంచాయతీ పరిధిలోని నార్త్ ఎస్సీ కాలనీలో సోమవారం గ్రామంలోని కుటుంబాలకు స్థానిక నివాసి నీసు చెన్నకేశవులు మహాలక్ష్మి దంపతులు నిత్యావసర సరుకులను తాసిల్దార్ ఎం. వి. కె. సుధాకర్ రావు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రాజారావు చేతుల మీదగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సుధాకర్ రావు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో గడిచిన ఒకటిన్నర నెల నుండి పనులు లేక పేదలు కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఇలాంటి తరుణంలో గ్రామానికి చెందిన చెన్నకేశవులు దంపతులు ముందుకు వచ్చి వారు ఉంటున్న ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం ముందుగా వారిని అభినందించాలి అన్నారు. అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జూపల్లి రాజారావు మాట్లాడుతూ కేశవులు సభ్యులు కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని నమ్మి బంగ్లా సెంటర్ లో చిన్న హోటల్ నిర్వహిస్తూ వారి పిల్లలను తాము పడ్డ కష్టం పడకూడదనే ఉద్దేశంతో బాగా చదివించారు అన్నారు. వారిలో ఒక అబ్బాయి బ్యాంకు ఉద్యోగం సంపాదించగా మరో అబ్బాయి గ్రామ వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఇప్పుడు చేస్తున్న సహాయము మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటికే పరిమితం కావాలన్నారు. అధికారులు సూచనలు సలహాలు పాటిస్తూ జీవనం కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు నీసు బాలకృష్ణ. దళిత సంఘం నాయకులు వా గాల పెంచలయ్య
 తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు