ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చేయూత

ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ చేయూత


వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): వింజమూరులోని వాటర్ ట్యాంక్ బస్టాండు వద్ద శుక్రవారం సాయంత్రం కే.జి.ఆర్.వి.యస్ (కొండా.గరుడయ్య, కొండా.రామచంద్రయ్య, కొండా.వెంకటసుబ్బయ్య)ల చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కూరగాయలు, వంట సరుకులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసిల్ధారు సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో వింజమూరు మండలంలో కొండా వారి కుటుంబ సభ్యుల నేతృత్వంలో నడుస్తున్న కే.జి.ఆర్.వి.యస్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. గత 50 రోజులుగా పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలను ఆదుకునేందుకు వేలాది రూపాయల నిధులను ఖర్చు చేస్తూ కొండా వారి కుటుంబీకులు తమ దాతృత్వమును చాటుకుంటుండటం గొప్ప విషయమన్నారు. దాతృత్వానికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం తప్పనిసరిగా ఉంటుందని ఆకాం క్షించారు. కొండా వారి కుటుంబం ఇప్పటివరకు ఆపదలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్య సేవలు, పేద విధ్యార్ధులకు స్కాలర్ షిప్ లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు, కార్యాలయాలకు బెంచీలు వితరణ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించి ధర్మ దాతలుగా నిలిచారన్నారు. తాజాగా కరోనా వైరస్ నియంత్రణకు గానూ ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ లో సైతం పేదలకు సేవలు అందిస్తుండటం లాంటి మహోన్నత సేవలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన అంశాలుగా తహసిల్ధారు సుధాకర్ రావు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కే.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ప్రతినిధులు కొండా.బాలసుబ్రహ్మణ్యం, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.చిన సుబ్బరాయుడు, కొండా.పెద సుబ్బరాయుడు, కొండా.వెంకటేశ్వర్లు, కొండా.సుమన్ లతో పాటు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు చవల.వెంకటసత్యనారాయణ, గంగిశెట్టి.హజరత్, దుగ్గి.మధు,  గంగిశెట్టి.సుధాకర్, కటకం.ప్రసన్న కుమార్, చీతిరాల.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
19 న నెల్లూరు పోలేరమ్మ జాతర కు దేవదాయ శాఖ మంత్రి రాక
రామన్న పేటలొ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image