వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: గుంటూరు బీ జె పీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.

                     Date: 15/05/2020
కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లతో  ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పధకం  అద్భుతం
వ్యవసాయ మౌళిక సదుపాయాలకు రూ. 1 లక్ష కోట్లు: – బీ జె పీ జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు.


గుంటూరు: కరోనా వైరస్ దెబ్బకు కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి దారిలో పెట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్లతో  ఆత్మ నిర్భర భారత్ అభియాన్ పధకం  ప్రవేశ పెట్టిందని, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారెని దేశ ప్రజలు ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారని, ఇలాంటి దేశ ప్రజల అభివృధి కోసం ఎన్నో పధకాలు ప్రవేశ పెట్టి, అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. మూడో విడతలో  ప్రకటించిన ప్యాకేజి లో భాగంగా శుక్రవారం మరిన్ని వరాలను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారని బీ జె పీ  జిల్లా కార్యదర్శి వై.వి. సుబ్బారావు తెలియజేశారు. 
తొలి విడతలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి రూ.5.94 లక్షల కోట్ల విలువైన 16 అంశాలను తెలియజేశారని, రెండో దశలో వలస కూలీలు, చిన్న రైతుల కోసం తొమ్మిది అంశాలతో కూడిన రూ.3.16 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ వివరాలను తెలియజేశారు. మూడో రోజైన శుక్రవారం.. వ్యవసాయం, దానికి అనుబంధంగా కొనసాగే పాడి, మత్య్స, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై అద్భుతమైన ప్యాకేజిని ప్రకటించారని, దేశంలో సప్లై చైన్ ఎలా ఉండాలో, దానికి టెక్నాలజీని ఎలా జోడించాలో ప్రధాని మోదీ తన సందేశంలో తెలియజేశారని, ఈ రంగంలో మొత్తం 11 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని, పంటలు చేతికొచ్చిన ఈ కీలక దశలోనే లాక్ డౌన్ కొనసాగినప్పటికీ, గడిచిన రెండు నెలల్లో రైతులకు కనీస మద్దతు ధరగా కేంద్రం రూ.74, 300కోట్లు చెల్లించిందని, గడిచిన రెండు నెలల కాలంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన(పీఎం కిసాస్) పథకం కింద దేశంలోని పేద రైతుల ఖాతాల్లోకి నేరుగా రూ.18,700 కోట్లు జమ చేశారని వై.వి. సుబ్బారావు తెలియజేశారు.  అలాగే, పీఎం ఫసల్ బీమా యోజన కింద గత రెండు నెలల్లోనే రూ.6,400 కోట్లు విడుదల చేశారాని,
పాడి పరిశ్రమకు రూ.5వేల కోట్లు, పలు కారణాల వల్ల పాల సేకరణ రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉందని, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా ఆ రంగాన్ని ఆదుకునేందుకు రూ.4,100 రూపాయలు వెచ్చించి, మిగులు పాలను సహకార డెయిరీల ద్వారా సేకరించారాణి వై.వి. సుబ్బారావు తెలియజేశారు. 2020-21 సంవత్సరానికిగానూ పాడి సహకార సంస్థల కోసం రూ.5వేల కోట్ల లిక్విడిటీని అన్ లాక్ చేసారని, తద్వారా 2కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని వై.వి. సుబ్బారావు తెలియజేశారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయల కల్పన కోసం రూ.1లక్ష కోట్లు కేటాయించారని, దీని ద్వారా ఈ రంగంలో కీలక భూమిక పోషించే ప్రాథమిక సహకార సంఘాలు, రైతు సంఘాలు, అగ్రికల్చర్ స్టార్టప్ లకు లబ్ధి చేకూరుతుందని, అలాగే, ఫుడ్ సెక్టార్ లో సూక్ష్మ పరిశ్రమకుల రూ.10 వేల కోట్లు ప్రకటించారని,  ఆత్మ నిర్భర్ ప్యాకేజీలో భాగంగా మత్య రంగానికి రూ.20 వేల కోట్లు కేటాయించారని, ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలోనే మత్య సంపద యోజన పేరుతో కొత్త పథకం ప్రకటించారాణి, మన దేశంలో సుమారు 55 లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని, వాళ్లందరికీ వ్యక్తిగత బోట్లు అందించడంతోపాటు బీమా సౌకర్యం కూడా కల్పిస్తారని మొత్తంగా రాబోయే ఐదేళ్లలో ఇప్పుడున్న దానికంటే 70 లక్షల టన్నులు అధికంగా మత్స్య ఉత్పత్తి సాధిస్తామనే నమ్మకముందని వై.వి. సుబ్బారావు తెలియజేశారు.


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*కరోనాను జయించిన వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి* వింజమూరు, అక్టోబర్ 14 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు ఎస్.ఐ ఏ.బాజిరెడ్డి కరోనాను జయించి బుధవారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిగిరి సి.ఐ శ్రీనివాసరావు ఎస్.ఐ బాజిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా కాలంలో పోలీసులు ప్రజలను కాపాడేందుకు చేసిన కృషి అందరికీ తెలిసిందేనన్నారు. పగలనక రేయనక ప్రజలను అప్రమత్తం చేసిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఈ కరోనా యుద్ధంలో పలువురు పోలీసులు సైతం కరోనా బారిన పడటం జరిగిందన్నారు. అయితే మనోధైర్యం, గుండె నిబ్బరంతో కరోనాతో పోరాడి విజేతలుగా నిలవడం గర్వించదగిన విషయమన్నారు. ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ వింజమూరు మండల ప్రజల ఆదరాభిమానాలు తనకు శ్రీరామరక్షగా నిలిచాయన్నారు. కరోనా మహమ్మారిని ఎవరూ కూడా తక్కువ అంచనా వేయరాదన్నాను. అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఏ.ఎస్.ఐ సాయిప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్ళు బాబూరావు, జిలానీభాషా, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image